తెలుగు చిత్రసీమలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో శనివారం రాత్రి జరిగిన దీపావళి పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరోలు, వాళ్ళ భార్యలు సైతం హాజరు అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి కూడా ఆ పార్టీలో సందడి చేశారు. యువ హీరోలతో తోడు విక్టరీ వెంకటేష్ కూడా కలిశారు. 


ఎన్టీఆర్, చరణ్ కలిశారు... గొడవలు లేనట్లే!
తెలుగు చిత్రసీమలో హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. ఇంతకు ముందు ఓసారి ఇదే విధంగా జరిగిన పార్టీలో మహేష్, ఎన్టీఆర్, చరణ్ సందడి చేశారు. ఎన్టీఆర్, చరణ్ అయితే 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో కలిసి నటించారు కూడా! అయితే... ఆ సినిమా విడుదల తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చాలా పుకార్లు షికార్లు చేశాయి. దీపావళి పార్టీతో వాటికి చెక్ పడినట్లు చెప్పవచ్చు.


మహేష్ భార్య నమ్రత, ఎన్టీఆర్ భార్య ప్రణతి, చరణ్ భార్య ఉపాసన కలిసి ఫోటోలు దిగారు. వాళ్ళతో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కోడలు, కార్తికేయ భార్య పూజా ప్రసాద్ కూడా జాయిన్ అయ్యారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో నమ్రత షేర్ చేశారు. అందులో ఓ ఫోటోను ఎస్ఎస్ కార్తికేయ తీశారని ఆమె పేర్కొన్నారు.


Also Read టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?






క్లింకారా పుట్టిన తర్వాత తొలి దీపావళి
మెగాస్టార్ ఇంట్లో ఈ ఏడాది జరిగిన దీపావళి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే... మెగా మనవరాలు, చరణ్ & ఉపాసన దంపతుల కుమార్తె క్లింకారా జన్మించిన తర్వాత వచ్చిన తొలి దీపావళి ఇది. అందుకని ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. 


Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?










కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట జరిగిన ఓ పార్టీలో వెంకటేష్, మహేష్ బాబు కలిశారు. అక్కడ వాళ్లిద్దరూ కార్డ్స్ ఆడటం పలు విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో కొందరు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ మెగాస్టార్ ఇంట్లో దీపావళి పార్టీకి వాళ్లిద్దరూ మరోసారి కలిశారు. అదీ సంగతి!