Disha Patani: విడుదలయ్యి అయిదు రోజులు అవుతున్నా ఇప్పటికీ చాలామంది ‘కల్కి 2898 AD’ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ కలెక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికీ మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అందులో దిశా పటానీ కూడా ఒకరు. మూవీ రిలీజ్ తర్వాత ఈ భామ ఫోటోగ్రాఫర్ల కంటపడింది. కూల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న దిశా చేతిపై కనిపించిన టాటూ.. ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


ప్రభాస్‌తో కెమిస్ట్రీ సూపర్..


ప్రభాస్, దిశా పటానీ కలిసి ఇంతకు ముందు కూడా ఒక సినిమాలో నటించాల్సింది. కానీ అప్పుడు ఆ ఆఫర్‌ను దిశా వదిలేసుకుంది. ఫైనల్‌గా ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జోడీగా నటించే అవకాశం అందుకుంది. పైగా ఇది ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిన మూవీ. దీంతో దిశాపై టాలీవుడ్‌లో మరోసారి ఫోకస్ పెరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్‌లోనే ఎక్కువగా బిజీ అయిపోయిన ఈ భామకు తెలుగులో కూడా అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు.  ముఖ్యంగా ‘కల్కి 2898 AD’లో దిశా కనిపించేది కాసేపే అయినా.. అందులోనే తన గ్లామర్, ప్రభాస్‌తో కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భామపై ఫోకస్ పెరగగా.. తాజాగా తన టాటూ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.


టాటూ వైరల్..


‘కల్కి 2898 AD’లో రాక్సీ పాత్రలో నటించింది దిశా పటానీ. తాజాగా తను ఫోటోగ్రాఫర్ల కంటపడగా బ్లూ టీషర్ట్, వైట్ జీన్స్‌లో ఉన్న దిశాను అందరూ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అదే క్రమంలో తన చేతిపై ఉన్న 'PD' అనే టాటూ.. వారి కంటపడింది. అసలు 'PD' అంటే ఏంటి అని అందరిలో సందేహం మొదలయ్యింది. ఆ అక్షరంతో మొదలయ్యేది ప్రభాస్ పేరే కాబట్టి దిశా.. ప్రభాస్ కోసమే ఆ టాటూ వేయించుకుందా అని ఫ్యాన్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్, దిశా పటానీ అనే పేర్లు కలిసేలా 'PD'ను టాటూగా వేయించుకుందేమో అని లేదా ప్రభాస్ డార్లింగ్ అని అర్థం వచ్చే టాటూ వేయించుకుందని భావిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇది ‘కల్కి 2898 AD’ కోసం దిశా వేయించుకున్న టెంపరరీ టాటూ అయ్యిండచ్చని అంటున్నారు.


టైగర్‌తో బ్రేకప్..


కొన్నాళ్ల క్రితం వరకు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంది దిశా పటానీ. కానీ ఏమైందో తెలియదు ఉన్నట్టుండి వీరిద్దరికీ బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయ్యిందని అందరికీ తెలిసేలా వీరిద్దరూ వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. టైగర్ ష్రాఫ్ తర్వాత దిశా పటానీ పలువురిని డేట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు తన చేతిపై ఉన్న 'PD' టాటూను చూసి ఈ భామ.. ప్రభాస్‌కు ఫిదా అయ్యిందా అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. మరి ఫ్యాన్స్ సందేహాలపై దిశా ఎలా స్పందిస్తుందో చూడాలి.



Also Read: నేను చాలా వికారంగా ఉంటాను, అదంతా నాకు అలవాటైపోయింది - నవాజుద్దీన్ సిద్ధికి