తరుణ్ భాస్కర్ దర్శకత్వ వహించిన 'కీడా కోలా' మూవీ నవంబర్ 3న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ హీరో చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఇదే విషయాన్ని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'పెళ్లిచూపులు' సినిమాతో దర్శకుడిగా వెండితెరకు ఆరంగేట్రం చేసిన తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తీసిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో యూత్ ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయాడు.


'ఈ నగరానికి ఏమైంది' తర్వాత డైరెక్షన్ కి గ్యాప్ తీసుకున్న తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అయిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'కీడా కోలా'. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. వీజీ సైన్మా బ్యానర్ పై వివేక్ సుదాన్షు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. తరుణ్ భాస్కర్ సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా 'కీడా కోలా మూవీని తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.






కాగా చిత్ర ప్రమోషన్స్​లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ అండ్ టైం ని మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది. 'కీడా కోలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 29 సాయంత్రం 6:30 నిమిషాలకు హైదరాబాద్ లోని యన్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. 'పెళ్లిచూపులు' సినిమాతో హీరోగా తనను నిలబెట్టిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కోసం 'కీడా కోలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ రాబోతుండడంతో ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చైతన్య రావు, బ్రహ్మానందం, విష్ణు ఓయ్, రాఘ్ మయూర్, రఘురాం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు.


ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ను బట్టి చూస్తే ఈ సినిమా తరుణ్ భాస్కర్ స్టైల్ లో టేకింగ్ అండ్ నెరేషన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. దర్శకుడిగా సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కీడా కోలా సినిమాతో రాబోతున్న తరుణ్ భాస్కర్ కి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. రీసెంట్ గా 'ఖుషి' మూవీ తో మంచి హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం గీతగోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : 'నా జీవితంలో అది గొప్ప టర్నింగ్ పాయింట్ - ఫ్యాన్స్ గుండెల్లో శాశ్వత 'ఖైదీ' ని చేసింది'






Join Us on Telegram: https://t.me/abpdesamofficial