Chiranjeevi Receives Golden Visa From UAE: మెగాస్టార్‌ చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల భారతదేశంలోనే రెండవ ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. అంతలోనే చిరంజీవికి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌  అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) నుంచి తాజాగా ఆయన గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. కాగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్‌ వీసాను అందిస్తుంది. ఈ గోల్డెన్‌ వీసాతో అరబ్‌ దేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండ వ్యాపారం చేసుకోవచ్చు.


ఇప్పటికే ఈ గోల్డెన్‌ వీసాను షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌, అల్లు అర్జున్‌ అందుకోగా ఇప్పుడు ఈ జాబితాలో చిరంజీవి కూడా చేరారు. ఇది తెలిసి మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. దీంతో ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ చిరంజీవికి విషెస్‌ తెలుపుతున్నారు. కాగా రీసెంట్‌గా అల్లు అర్జున్‌ ఈ గోల్డెన్‌ వీసాను అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్‌ అందుకోవడం విశేషం. కాగా ఇప్పటి వరకు ఈ గోల్డెన్‌ వీసాను రజనీకాంత్‌, షారుక్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి, మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, అల్లు అర్జున్‌, త్రిష, అమలాపాల్‌, కాజల్‌ అగర్వాల్‌కు అందుకున్నారు.






అలాగే మెగా కోడలు ఉపాసన కూడా ఈ గోల్డెన్‌ వీసా అందుకున్నారు. కాగా 10 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబ‌డిదారులు, వ్య‌వ‌స్థాప‌కులు, సాహిత్యం, విద్య‌, క‌ల్చ‌ర్‌... ఇలా వివిధ రంగాల వారికి  యూఏఈ ప్రభుత్వం ఈ ప్రత్యేక వీసాలను ఇస్తుంది. ఇది పొందిన వారు యూఏఈలో ఎలాంటి ఆంక్షలు లేకుండా దీర్ఘ‌కాలికంగా నివ‌సించవచ్చు. అలాగే అక్కడి పౌరులుగా యూఏఈ ప్ర‌భుత్వం క‌ల్పించే అన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అదే విధంగా వంద శాతం ఓన‌ర్‌షిప్‌తో  అక్కడ పెట్టుబడులు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు.


Also Read: ఎన్టీఆర్‌ జయంతి, మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర ట్వీట్‌ - కొందరి కీర్తి అజరామరం... తరతరాలు శాశ్వతం...


ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బింబిసార ఫేం వశిష్ఠ దర్వకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. సోషియో ఫాంటసీగా చిత్రంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఈ సినిమా కెటాయిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సనీ సర్కిల్లో టాక్‌. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. యంగ్‌ హీరోయిన్‌ ఆషికా రంగనాథన్‌, సురభి, ఈషా చావ్లా వంటి నటీమణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జవవరి 10న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.