Charmi Kaur Unfollow Ravi Teja and Director Harish Shankar: నిర్మాత, నటి  ఛార్మీ చేసిన పనికి  ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ వర్గాలంతా అంతా షాక్‌ అవుతున్నారు. ఆమె ఎందుకిలా చేసిందని, ఇంతకి హీరో రవితేజ,  ఛార్మీ  మధ్య ఏం జరిగిందంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. ఛార్మీ మాస్ మహారాజా రవితేజను సోషల్‌ మీడియాల్లో అన్‌ఫాలో చేసింది. రవితేజ మాత్రమే కాదు డైరెక్టర్‌ హరీశ్ శంకర్‌ని కూడా అన్‌ఫాలో చేసింది. ఇండస్ట్రీలో వీరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. దీంతో స్నేహితులుగా వీరిని  ఛార్మీ అన్‌ఫాలో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ మారింది. 


ఒకప్పుడు హీరోయిన్‌గా  ఛార్మీ  వరుస సినిమాలతో అలరించింది. ప్రభాస్, నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, సుమంత్‌ వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. ఆమెకు ఆఫర్స్‌ తగ్గడంతో నిర్మాతగా మారింది. పూరీ జగన్నాథ్‌ బ్యానర్‌ పూరీ కనెక్ట్స్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో రూపొందే సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహిరిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలకు రెడీ అవుతుంది. అయిత అదే డేట్‌ హరీశ్‌ శంకర్‌, రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ కూడా రిలీజ్‌ కానుంది.


ఈ విషయాన్ని ఎప్పుడో మూవీ టీం ప్రకటించింది. ఇటీవల డబుల్‌ ఇస్మార్ట్‌ను కూడా అదే తేదీకి విడుదల చేస్తున్నట్టు పూరీ కనెక్ట్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదల కానున్నాయి. దీంతో ఈ విషయంలోనే మిస్టర్‌ బచ్చన్‌ అండ్‌ డబుల్‌ ఇస్మార్ట్‌ టీంకు మధ్య మనస్పర్థలు వచ్చాయామే అంటున్నారు. నిజానికి పూరీకి రవితేజ, హరీశ్‌ శంకర్‌తో మంచి అనుబంధం ఉంది. హరీశ్‌ శంకర్‌ పూరీ శిష్యుడు కూడా. ఇడియట్‌ సినిమాతో రవితేజ, పూరీకి కూడా మంచి సన్నిహితం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో "దేవుడు చేసిన మనుషులు"తో పాటు మరిన్ని సినిమాలు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీలో పూరీకి, రవితేజకు మంచి బాండింగ్‌ ఉంది. హరీశ్‌ శంకర్‌ శిష్యుడు కాబట్టి ఒకరిపై ఒకరు గౌరవంతో ఉంటారు.



అయితే ఇప్పుడు వారి సినిమాలు ఒకేసారి బాక్సాఫీసు వద్ద క్లాష్‌ అయ్యాయి. ఈ విషయంలో వారి మధ్య చర్చలు జరిగాయట. ఎవరోకరు తగ్గి తమ సినిమా వాయిదా వేయాలని చర్చికున్నాయని, ఇందులో ఎవరూ తగ్గకపోవడం మనస్పర్థలు వచ్చాయని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రీజన్‌తోనే  ఛార్మీ రవితేజ, హరీశ్‌ శంకర్‌లను తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో అన్‌ఫాలో చేసిందనే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా చార్మి స్పందించే వరకు వెయిట్‌ చేయాల్సిందే. దీనికి అసలు కారణం ఏం చెబుతుంది? మరి ఈ వార్తలను చూసి చూడనట్టు వదిలేస్తుందా? వెయిట్‌ అండ్‌ సి. నిజానికి మిస్టర్‌ బచ్చన్‌ను ఆగస్ట్‌ 15న విడుదల చేయడానికి ఓటీటీ ప్లాట్‌ ఫాంతో జరిగిన ఢీల్‌ కారణమని తెలుస్తోంది.  


Also Read: షూటింగ్‌లో ప్రమాదం - 'ప్రేమలు' నటుడికి తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక