కోలీవుడ్ లో రీసెంట్ గా 'మావీరన్'(తెలుగులో మహావీరుడు) సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేసి భారీ సక్సెస్ అందుకున్న హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'అయాలన్' ఒకటి. ఇందులో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆదరించేందుకు సిద్ధమవుతున్నాడు శివ కార్తికేయన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.


శివ కార్తికేయన్ ఆకాశంలో విహరిస్తుండగా, అతనితో పాటు ఏలియన్ కూడా వెళుతున్న లుక్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ చిత్ర టీజర్ ని అక్టోబర్ 6న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించబోతున్నారట. మొదట్లో ఈ చిత్రాన్ని 2023 దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ సీజీ వర్క్ లో జరిగిన జాప్యం వల్ల నిర్మాతలు సినిమా విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేయాల్సి వచ్చింది.


ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక సంఖ్యలో సీజీ షాట్స్ 'అయలాన్' కోసం మేకర్స్ ఉపయోగించినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ తరహాలో ఈ సినిమా అవుట్ ఫుట్ ఉండనున్నట్లు చెబుతున్నారు. అప్పట్లో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ నటించిన 'కోయి మిల్ గయా'(Koi Mil Gaya) సినిమా తరహాలోనే ఈ చిత్రం ఉంటుందని కొందరు చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమాలో శివ కార్తికేయన్ మరోసారి డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నారు. శరత్ కేల్కర్, ఈశా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.


కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్ పై జే రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు రాజ్ కుమార్ పెరియార్ సామి దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ కార్తికేయన్. 'SK 21' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా  నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని కోలీవుడ్ సీనియర్ హీరో కమలహాసన్ రాజ్ కమల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : 'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial