వర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మెగా మల్టీ స్టారర్ మూవీ 'బ్రో' (BRO). ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆరంభం నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విలక్షణ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక మూవీ టీం ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ భారీ హై క్రియేట్ చేస్తున్నారు. క్రమంలోనే తాజాగా 'బ్రో' మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.  


తాజాగా విడుదలైన పోస్టర్లో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ఇద్దరరూ లుంగీ కట్టుకొని, వింటేజ్ లుక్ లో అదిరిపోయారు. ఇక ఈ పోస్టర్ను రిలీజ్ చేస్తూ త్వరలోనే టీజర్ రాబోతుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే టీజర్ అప్డేట్ ఇచ్చారు. కానీ డేట్ అండ్ టైం మెన్షన్ చేయలేదు. ఇలాంటి తరుణంలోనే తాజాగా 'బ్రో' టీజర్ సంబంధించి మరో అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు మేకర్స్.


తాజాగా 'బ్రో' టీజర్ కు సంబంధించి డబ్బింగ్ పూర్తయినట్లు మూవీ టీం కొన్ని వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ టీజర్ కు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు. పక్కనే దర్శకుడు సముద్రఖని కూడా ఉన్నారు. ఈ మేరకు మేకర్స్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'బ్రో' టీజర్ డబ్బింగ్ పూర్తయిందని, త్వరలోనే టీజర్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని తెలియజేశారు. ఇక ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అని ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.






ఇక తాజాగా మేకర్స్ వదిలిన టీజర్ డబ్బింగ్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండడంతో టీజర్లో కేవలం ఆయన చెప్పే డైలాగ్స్ మాత్రమే ఉంటాయని కొంతమంది అంటున్నారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తోనే ఈ టీజర్ ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన 'బ్రో' టీజర్ కి డబ్బింగ్ చెప్పడం విశేషం.


కాగా పవన్ కళ్యాణ్, సాయి తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిగా శర్మ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. జూలై 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓ జి' సినిమాలతో బిజీగా ఉన్నారు.