Director Hansal Mehta Slams Nandamuri Balakrishna: టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాల‌కృష్ణ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విశ్వక్‌ సేన్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ ఈవెంట్‌లో హీరోయిన్‌ అంజలి పట్ల ఆయన ప్రవర్తించిన తీరుపై సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అంజలిని స్టేజ్‌పైన ఆయన తోసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఈ వీడియో చూసిన ఆయన ఆయన విచిత్ర ప్రవర్తనకు షాకై ఆయనపై సంచలన కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్‌ హన్సల్ మెహతా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'స్కామ్1992' (Scam 1992), 'సిటీలైట్స్', అలీఘర్ వంటి సినిమాలతో ఆయన డైరెక్టర్‌ మంచి గుర్తింపు పొందారు. అయితే తాజాగా ఆయన బాల‌కృష్ణ అంజలిని తోస్తున్న వీడియో చూసి దానిపై స్పందించాడు. ఆయన వీడియో తన ఎక్స్‌లో రీషేర్‌ చేస్తూ బాలయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.







ఆ వీడియోను తన ఎక్స్‌లో షేర్‌ చేస్తూ "కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరూ?(Who is this scumbag?)" అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన కామెంట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు హన్సల్‌ మెహతాకు సపోర్టు చేస్తూ బాలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ నెటిజన్‌ అయితే "ఆయన ఎక్స్‌ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ కుమారుడు. ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా. అయితే ఆయనకు మెంటాలిటీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్‌ను ఉంది. అందువల్ల అతడు ఏం చేసిన ఇలా వివాదం అవుతుందంటూ ఆయన పోస్ట్‌పై కామెంట్‌ చేశారు. మరోవైపు ఈవెంట్‌లో బాలయ్య కూర్చుని ఉన్న చోట బాటిల్లో మందు ఉన్న విజువల్స్ కూడా వైరల్‌ అవుతున్నాయి. అయితే అక్కడ ఎలాంటి బాటిల్స్‌ లేవని, వాటిని సిజీ చేసి చూపిస్తున్నారంటూ గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి నిర్మాత వివరణ ఇచ్చారు. 





కాగా ఈ వీడియోపై గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ టీం స్పందించింది. ఈ మూవీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరో విశ్వక్‌ సేన్‌ మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చారు. నేడు జరిగిన ప్రెస్‌ మీట్‌లో విశ్వక్ సేన్‌ మాట్లాడుతూ.. వైరల్‌ అవుతున్న ఆ వీడియోకి ముందు, వెనక ఏం జరిగిందనేది చూస్తే సరిపోతుందని, అక్కడ ఏం జరిగిందో అర్థమవుతుందన్నారు. ఇక నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. స్టేజ్‌పై మేమంతా మాట్లాడుకుంటున్నాం. ఉదాహరణకు విశ్వక్, మీరు మరికొందరు అక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. మిమ్మల్ని జరగమని చెబితే మీకు వినపడనప్పుడు. జరగమంటూ కాస్తా వెనక్కి అన్నారు. అది వారిద్దరి మధ్య ఉన్న చనువు వల్ల అలా జరిగింది. దాన్ని కొందరు కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారు. అది జరిగిన తర్వాత హీరోయిన్‌ అంజలి, బాల‌కృష్ణ గారు హైఫైవ్‌ కూడా ఇచ్చుకున్నారు. ఆ వీడియో ఎందుకు చూపించడం లేదు" అని ఆయన వివరణ ఇచ్చారు.