బాలీవుడ్ భామ రాఖీ సావంత్ (Rakhi Sawant) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో అదరగొట్టే ఈ బ్యూటీ... సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు తన మాజీ భర్త ఆదిల్‌ ఖాన్‌ దురానీ (Adil Khan Durrani)పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచింది రాఖీ. హనీమూన్ టైములో తను స్నానం చేస్తున్నప్పుడు ఆదిల్‌ వీడియోలు తీసాడని, ఆ న్యూడ్ వీడియోలను రూ. 50 లక్షలకు అమ్మేశాడని సంచలన ఆరోపణలు చేసింది. 


ఇటీవల రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''అదిల్, నేను హనీమూన్ కు వెళ్ళాం. నేను బాత్ టబ్ లో ఉన్నప్పుడు అదిల్ కొన్ని వీడియోలు తీశాడు. ఆ తర్వాత నేను బూత్ రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు మరికొన్ని వీడియోలు తీశాడు. అతనితో బెడ్ పై ఉన్నప్పుడు కూడా వీడియోలు షూట్ చేశాడు. నా న్యూడ్ వీడియోలను ఓ దుబాయ్‌లోని ఓ అరబ్ వ్యక్తికి రూ. 47 - 50 లక్షలకు అమ్మేశాడు'' అంటూ మాజీ భర్తపై ఆరోపణలు చేసింది. 


''ఆ వీడియోలలో నా శరీరం మొత్తం నగ్నంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ వీడియోలు వైరల్‌ అయితే నేను ఏం చేయాలి? ప్రపంచమంతా నా వీడియోలు చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి? ఈ సమాజానికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? భర్తగా నన్ను సంతోషపెట్టాల్సిన అతను నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు'' రాఖీ వాపోయింది. ఈ సందర్భంగా పెళ్లికి ముందే ఆదిల్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని చెప్పింది. 


Also Read: వామ్మో! యంగ్ టైగర్ పెట్టుకున్న వాచ్ అన్ని కోట్లా? 


"ఒకసారి ఆదిల్ చెల్లెలు నాకు ఫోన్ చేసి కారు గిఫ్టుగా ఇస్తానని చెప్తే, ముంబైకి పంపించమని కోరాను. కానీ తను మైసూర్ వచ్చి స్వయంగా తీసుకెళ్లమని చెప్పింది. నేను కారు కోసం మైసూర్ వెళ్లాను. ఆదిల్ రూమ్ లో ఉన్నాడని చెబితే, నేను లోపలకు వెళ్లాను. అతని మనిషి ఒకరు బయట నుంచి డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు. ఆ టైమ్ లో ఆదిల్ నాపై దాడి చేశాడు. బట్టలు చించేసాడు. 3 గంటల పాటు ఏం చేయాలో అన్నీ చేశాడు" రాఖీ సావంత్ చెప్పింది. దీనిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని భావించానని, అయితే మరుసటి రోజు ఆదిల్ వచ్చి సారీ చెప్పాడని తెలిపింది. 'బాధపడకు.. నువ్వు మంచి అమ్మాయివి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని అదిల్ తనతో అన్నాడని... కొన్ని రోజుల తర్వాత గోవాకు వెళ్తే అక్కడికి వచ్చి తనని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. 


కాగా, రాఖీ సావంత్ - ఆదిల్‌ దురానీ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొంత కాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో, వీరు విడిపోయారు. ఈ క్రమంలోనే ఆదిల్‌ తనకు వేధిస్తున్నాడంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాఖీ పోలీసులను ఆశ్రయించింది. ఆదిల్ తన నిధులను దుర్వినియోగం చేశాడని, గృహ హింసకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో దాదాపు ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన అతను ఆ మధ్యే బయటకు వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాఖీ తనపై కుట్ర పన్నిందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన నగ్న వీడియోను అమ్మేశాడని ఆదిల్‌ పై రాఖీ ఆరోపణలు చేసింది. ఆదిల్‌ ను తన భర్తగా భావించడం లేదని, అతడి నుంచి విడాకులు తీసుకుంటానని చెప్పుకొచ్చింది. 


Also Read: రామ్ కోసం రంగంలోకి దిగనున్న బాలయ్య?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial