అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్​గా ఓ వెలుగు వెలిగిన ఆమె, తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం నటిగా బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ వెండితెర మీద సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్​గా ఉండే అనసూయ.. తన హాట్ ఫోటోలు, వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. అదే సమయంలో విపరీతంగా ట్రోలింగ్​కు గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా 'ఆంటీ' అంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. అనసూయ వీలుకుదిరినప్పుడల్లా ట్రోలర్స్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో పోలీస్ కేసులు పెట్టడానికి కూడా ఆమె వెనకాడలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆంటీ అంటే తనకు ఎందుకు అంత కోపం వస్తుందో అనసూయ వివరించింది.


చిన్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే తనకు ఇబ్బందేమీ లేదని, కానీ మరో రకంగా అలా పిలిచే పెద్దవాళ్ళకు తను ఆంటీని కాదని తెలిపింది అనసూయ. ఆంటీ అని పిలవడం తనకు నచ్చదని చెప్పినప్పుడు ఎందుకు అలా పిలవాలని ప్రశ్నించింది. ముఖ పరిచయంలేని తన మీదే వాళ్ళకి ఇంత హేట్ ఉందంటే, వారి చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో ఎలా ఉంటారో ఆలోచించాలని.. ఇలాంటి వాళ్ళే రేపు రేపిస్ట్​లుగా తయారవుతారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ''నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే 'ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా.. ఇవన్నీ మీకు ఎందుకు ఆంటీ' అని కామెంట్స్ చేస్తుంటారు. ఆంటీ అనే పదం తప్పు కాదు. కానీ దాన్ని కొందరు కొంచెం వల్గర్​గా వాడతారు. మల్లూ ఆంటీ లాగా వాడతారనేది వాళ్ళ సౌండ్ ని బట్టి నాకు అర్థమైపోతుంది. నా పిల్లల ఫ్రెండ్స్ నన్ను ఆంటీ అనే పిలుస్తారు. వాళ్ళకి ఏ ఇంటెన్షన్ ఉండదు కాబట్టి చాలా క్యూట్ గా ఉంటుంది'' అని చెప్పింది అనసూయ. 


''ఆంటీ అంటే పిన్ని.. అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి ఉపయోగించాలని మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. నేను కూడా చిన్నప్పుడు చాలా మంది పక్కింటి వాళ్ళని ఆంటీ అనే పిలిచాను. ఒకవేళ వాళ్ళు అలా పిలవొద్దు, మాకు ఏజ్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నాం అంటే నేను ఇంక పిలవను. నేను అలా పిలిస్తే వాళ్ళు హర్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు ఆంటీ అని పిలవడం మానేస్తా. ఏదో కారణంతో నన్ను అలా పిలవడం నాకు నచ్చట్లేదు. అయినా ఎందుకు అలా పిలవాలి?. అవతలి వాళ్ళని ఎందుకు హార్ట్ చేయాలి? అలాంటి పైశాచిక ఆనందం ఎందుకు? ఈ జన్మలో మనం ఫేస్ టు ఫేస్ చూసుకుంటామో లేదో తెలియదు. అయినా నా మీద అంత హేట్ ఉందంటే, అతని చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో వాడు ఎలా ఉంటాడు?. ఇలాంటి వాళ్లే రేపు రేపిస్ట్​లు అవుతారు'' అని అనసూయ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
 
అనసూయని ఆంటీ అంటూ గతంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయ్యేలా చేసారు. దీనిపై ఘాటుగా స్పందించిన యాంకర్‌.. తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని పలుమార్లు హెచ్చరించింది. చెప్పినట్లుగానే తనను ఏజ్ షేమింగ్ చేస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే వివాదంపై ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఆంటీ అని పిలవడంలో తప్పు లేదు కానీ, గడ్డాలు మీసాలు వచ్చిన వారు కూడా అలా పిలిస్తే ఒప్పుకోనని అనసూయ స్పష్టం చేసింది. తన పిల్లల వయసున్న వారు ఆంటీ అని పిలిస్తే అర్థం ఉందని, కానీ పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు పిలిస్తే మాత్రం ఊరుకోనని తేల్చి చెప్పింది.


ఆంటీ అని పిలిస్తే ఎందుకంత కోపం వస్తుందనే విషయంపై ఇంస్టాగ్రామ్ లో మాట్లాడుతూ ''ఆంటీ అంటూ వాళ్లు పిలిచే పిలుపులకు అర్థాలు వేరే ఉంటాయి. అందుకే నాకు కోపం వస్తుంది. అయినా ఇప్పుడు నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నా. పైగా నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అందుకే ఆ చెత్త కామెంట్లను పట్టించుకోవటం మానేశాను'' అని అనసూయ తెలిపింది. ఇప్పుడు లేటెస్టుగా మరోసారి ఆంటీ వివాదంపై వివరణ ఇచ్చింది.