అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)కు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్... ట్రోల్ బేస్ కూడా ఉంది. ఆవిడ ఏం చేసినా సరే డిస్కషన్ టాపిక్ అవుతుంది. కొంత మంది క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ప్రజెంట్ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విస్ట్ ఏమిటంటే... ఆ వీడియో నాలుగు సంవత్సరాల కృతం అనసూయ చేసిన పెర్ఫార్మన్స్ ఉంది. ఆ పెర్ఫార్మన్స్, ఆవిడను ట్రోల్ చేసిన తేజు అనే నెటిజన్ ఆవిడ దృష్టిలో పడ్డారు. సో, అతడికి సైలెంట్‌గా ఇచ్చి పడేసింది. 


మహానటికి నివాళి ఇస్తే ఆమెకు ఇచ్చే మర్యాద ఇదా?
Anasuya Trolled Again: టీవీ షోస్ మీద నెటిజన్స్ టార్గెట్ చేశారు. డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్... ప్రోగ్రాం ఏదైనా సరే అందులో ఎవరో ఒకరి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ మస్ట్ అండ్ షుడ్. తప్పకుండా ఉంటుంది. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ట్రోల్ అవుతున్నాయి. అలాగే, నాలుగు సంవత్సరాల కృతం ఓ ప్రోగ్రాంలో మహానటి సావిత్రికి నివాళిగా అనసూయ ఇచ్చిన పెర్ఫార్మన్స్ ట్రోల్ అవుతోంది. తేజు అనే నెటిజన్ ఆ పెర్ఫార్మన్స్ చూసి జడుసుకున్నట్టు 'ప్రేమలు' మూవీలో ఎమోజీ పోస్ట్ చేశారు. అది చూసిన అనసూయ 'మహానటి సావిత్రికి నివాళిగా పెర్ఫార్మన్స్ ఇస్తే మీరు ఇచ్చే మర్యాద ఇదా?' అంటూ రిప్లై ఇచ్చింది.


Also Read: కిరణ్ అబ్బవరం 2.0 - కాంతార రేంజ్‌లో 'క' టీజర్, ఆ విజువల్స్ చూశారా?



బాబు గారింట్లో బుట్ట భోజనం చూసి అప్పుడు క్రిటిసైజ్ చెయ్యి!
''హలో తేజు! నువ్వు బావున్నావని ఆశిస్తున్నాను. నా ప్రశాంతత కోసం ఇటువంటివి ఏవి వచ్చినా రియాక్ట్ కాకూడదని నిర్ణయం తీసుకున్నా. కానీ, మహానటి సావిత్రమ్మ గారికి నివాళిగా నేను ఇచ్చిన పెర్ఫార్మన్స్ నుంచి ఈ క్లిప్ వైరల్ అవ్వడం నేను కొన్ని రోజులుగా చూస్తున్నాను. అది నాలుగేళ్ల క్రితం ఇచ్చిన పెర్ఫార్మన్స్. దానిని కించపరిచేలా వాడుతున్నారు. నా గురించి నేను మాట్లాడటం లేదు. సద్విమర్శను నేను ఎప్పుడూ స్వాగతిస్తా. అయితే ఇక్కడ చేస్తున్న విమర్శల వల్ల ఎవరికి అయితే నివాళి ఇచ్చామో ఆ వ్యక్తిని సైతం అగౌరవ పరుస్తున్నారు. నా పెర్ఫార్మన్స్ పూర్తిగా చూసి మాట్లాడు. అప్పుడు జడ్జ్ చేయాలి అనుకుంటే చెయ్. జీ 5 ఓటీటీలో 'బాబు గారింట్లో బుట్ట భోజనం' అని ప్రోగ్రాం ఉంటుంది. అది చూడు. నీకు నా పెర్ఫార్మన్స్ నచ్చవచ్చు. లేదంటే నచ్చకపోవచ్చు. కానీ, ముందు లెజెండ్ సావిత్రమ్మ కోసం అయినా సరే అది పూర్తిగా చూడు. తర్వాత ఎప్పటిలా నన్ను విమర్శించు'' అని అనసూయ ట్వీట్ చేశారు. చాలా సైలెంట్‌గా ట్రోల్ చేసిన వ్యక్తికి ఇచ్చి పారేశారు. అదీ సంగతి!


Also Readపీవీఆర్ పంజాగుట్టలో ప్రేక్షకులకు షాక్... థియేటర్‌లో వర్షం... కల్కి 2898 ఏడీ షో క్యాన్సిల్