Bollywood Stars: బాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాల్లో నటిస్తూనే  మరోవైపు ప్రకటనలు, ఇంకోవైపు వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటారు.  చాలా బ్రాండ్లను ఎండార్స్ చేస్తారు, కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఇలా రెమ్యునరేషన్ తో పాటూ అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది. చాలామంది సెలబ్రిటీలు ఎక్కువగా ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. తమ ఆస్తులను అమ్మడం ద్వారా సెలబ్రిటీలు ప్రతి సంవత్సరం భారీ లాభం పొందుతారు. బాలీవుడ్‌లో 2025లో ఆస్తులను అమ్మడం ద్వారా కోట్లు సంపాదించిన ఐదుగురు గురించి  తెలుసుకుందాం.

Continues below advertisement

అమితాబ్ బచ్చన్ కోట్లు సంపాదించారు

అమితాబ్ బచ్చన్ సినిమాలు , రియాలిటీ షోల నుంచి భారీ రెమ్యునరేషన్   తీసుకుంటారు. కానీ ఈ సంవత్సరం  ఆస్తులను అమ్మడం ద్వారా అంతకుమించి ఆదాయం పెంచుకున్నారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం, అమితాబ్ బచ్చన్ ఓషివారాలో తన డూప్లెక్స్‌ను విక్రయించారు.  దీనిని 2021లో 31 కోట్లకు కొనుగోలు చేశారు... 2025లో 83 కోట్లకు విక్రయించారు. ఈ డూప్లెక్స్ ద్వారా బిగ్ బీకి 168 శాతం లాభం వచ్చింది.  ఈ మధ్యకాలంలో అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. నివేదికల ప్రకారం, అమితాబ్ మరియు అభిషేక్ 2024లోనే సంయుక్తంగా రూ.100 కోట్లు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. 2020 మరియు 2024 మధ్య, నటుడు వివిధ ఆస్తులలో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

Continues below advertisement

జితేంద్ర 855 కోట్లకు భూమిని విక్రయించారు

ఎప్పుడూ తన సినిమాల గురించి చర్చల్లో ఉండే బాలీవుడ్ నటుడు జితేంద్ర.. 2025లో  తన అంధేరి భూమి గురించి వార్తల్లో నిలిచారు. CNBC TV18 నివేదిక ప్రకారం, జితేంద్ర తన 2.39 ఎకరాల భూమిని 855 కోట్లకు విక్రయించారు. ఈ ఆస్తి ద్వారా జితేంద్ర కోట్లు లాభం పొందారు.

అక్షయ్ కుమార్ 6 ఆస్తులను విక్రయించారు

 సక్సెస్ ఫుల్ మూవీస్ కి కేరాఫ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాల్లో నటించడంతో పాటు ఆస్తుల కొనుగోలుపైనా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆస్తిని కొనుగోలు చేస్తుంటారు.  2025లో అక్షయ్ కుమార్ తన 6 ఆస్తులను విక్రయించారు. దీనివల్ల  కోట్ల రూపాయల లాభం వచ్చింది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, అక్షయ్ ఈ సంవత్సరం ఇప్పటివరకు తన 6 ఆస్తులను విక్రయించారు. ఇందులో అపార్ట్‌మెంట్లు , ఆఫీస్ స్పేస్ కూడా ఉన్నాయి. దీని ద్వారా  100 కోట్లకు పైగా లాభం వచ్చింది.

ప్రియాంక చోప్రా కోట్లు సంపాదించింది

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ప్రియాంక చోప్రాకు ఓబెరాయ్ స్కై గార్డెన్‌లో 4 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఆమె ఈ నాలుగు ఫ్లాట్‌  ల ద్వారా భారీగా ఆదాయం పొందింది. బాలీవుడ్, హాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ప్రియాంక ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్ట్ లో నటిస్తోంది

సోనాక్షి సిన్హాకు 61 శాతం లాభం వచ్చింది

సోనాక్షి సిన్హా కూడా 2025లో తన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను విక్రయించింది. సోనాక్షి పెళ్లికి ముందు ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉండేది . ది ప్రాపర్టీ స్టోర్ సోనాక్షి అపార్ట్‌మెంట్ అమ్మకం గురించి సమాచారం అందించింది. 2020లో 14 కోట్లకు కొనుగోలు చేసిన ఈ అపార్ట్ మెంట్ ను 22.50 కోట్లకు విక్రయించింది.