హిందీలో ‘ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌’ పేరుతో ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధ‌ర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ మైఠలాజికల్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం అల్లు అర్జున్ (Allu Arjun) సంప్రదించినట్టు తెలుస్తోంది.


The Immortal Ashwatthama Movie Update : “అశ్వత్థామ అనేది ఆదిత్య ధర్ కలల ప్రాజెక్టు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను కథానాయకుడిగా తీసుకోవడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం టాక్స్ నడుస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఆసక్తిగా ఉన్నారు. ఈ చర్చలు దాదాపు సక్సెస్ అయినట్లే చెప్పుకోవచ్చు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది” అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  


మొదట్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్ల పరిశీలన


తొలుత ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ‘RRR’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూ. ఎన్టీఆర్, ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటిన అల్లు అర్జున్ పేర్లను మేకర్స్ పరిశీలించారు. వీరుకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒకరిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని ఆదిత్య ప్రయత్నించారు. ఇందుకోసం ఇరువురితో చర్చలు జరిగాయి. చివరకు బన్నీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి చాలా కాలంగా ఈ సినిమా గురించి బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో ‘ఉరి’ హీరో విక్కీ కౌశల్ ను హీరోగా తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరినీ పక్కన పెట్టేశారు.  


ప్రతిష్టాత్మక చిత్రంలో బన్నీకి అవకాశం   


సూపర్ హిట్ చిత్రం ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ తెరకెక్కించిన తర్వాత ఆదిత్య ధర్  ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే డ్రీమ్ ప్రాజెక్టు చేపట్టారు. గతంలో ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించేందుకు ఓకే చెప్పారు. ఆ సమయంలో విక్కీ కౌషల్ ను హీరోగా అనుకున్నారు. అయితే, కారణాలు బటయకు తెలియకపోయినా, ఈ ప్రాజెక్టు నుంచి రోనీ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని టేకప్ చేసింది. ఆ సమయంలో హీరోగా రణ్ వీర్ సింగ్ ను తీసుకోవాలి అనుకున్నారు.  తాజాగా వీరి స్థానంలో  అల్లు అర్జున్ ను దాదాపు ఖరారు చేశారు.  హిందూ ఇతిహాసం మహాభారతంలోని అశ్వత్థామ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   


ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో పాటు సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం. 


Also Read 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?






Read Also: సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న నజ్రియా - షాకింగ్ డెసిషన్