బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది 'ఆర్ఆర్ఆర్', 'బ్రహ్మాస్త్ర' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తోంది. గతంలో చిన్నపిల్లలకు సంబంధించి 'ఎడ్- ఎ - మమ్మా' అనే బట్టల బ్రాండ్ ను ప్రారంభించిన ఆలియా భట్ ప్రస్తుతం దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆలియా భట్ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసం ఆలియా భట్ తో అంబానీ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పలు వ్యాపారాలతో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది.


తాజాగా ఆమె వ్యాపార విస్తరణలో భాగంగా ఆలియా భట్ దుస్తుల బ్రాండ్ కంపెనీని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉండగా.. తన కూతురి వ్యాపార విస్తరణ కోసం అంబానీ ఆలియా బట్ తో భారీ మొత్తంలో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఈ మేరకు రిలయన్స్ రిటైల్ వెంచర్ లో భాగమైన రిలయన్స్ బ్రాండ్ ఆలియా భట్ కి చెందిన చిల్డ్రన్ వేర్ బ్రాండ్ 'ఎడ్ - ఏ - మమ్మా' కంపెనీని కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆలియా భట్ దుస్తుల బ్రాండ్ కంపెనీని రిలయన్స్ రిటైల్ సుమారు రూ.300 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బిజినెస్ డీల్ కు సంబంధించిన డిస్కషన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో ఈ డీల్ కు సంబంధించి పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


కాగా ఆలియా భట్ 'ఎడ్ - ఎ - మమ్మా' అనే పేరుతో చిన్న పిల్లలకు సంబంధించిన దుస్తుల బ్రాండ్ కంపెనీని 2020లో ప్రారంభించారు. 2 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు సంబంధించిన అన్ని రకాల దుస్తులు ఇందులో దొరుకుతాయి. ఇక ఈ ఏడాది ప్రారంబ్భం నుంచి కొత్తగా బాలికలకు దుస్తులు, స్లీప్ సూట్లు, బాడీ సూట్లు సైతం విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ కంపెనీని మరింత విస్తరించాలని అనుకుంటున్నట్లు  ఈమధ్య ఆలియా భట్ ఓ మీడియా సమావేశంలో చెప్పారు. ఇంతలోనే రిలయన్స్ ఆలియా భట్ దుస్తుల కంపెనీని కొనుగోలు చేయడానికి సిద్ధమైందనే వార్తలు రావడం గమనార్కంగా మారాయి.


ఇక ముఖేష్ అంబానీ గత ఏడాది ఆగస్టు నెలలో రిలయన్స్ రిటైల్ హెడ్ గా తన కూతురు ఇషా అంబానీని నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె రిలయన్స్ రిటైల్ హెడ్ గా ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆలియా భట్ దుస్తుల బ్రాండ్ ని ఏకంగా రూ.300 కోట్లకి కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆలియా భట్ సినిమాల విషయానికొస్తే..బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కపూర్ తో కలిసి 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' అనే సినిమాలో నటించింది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.


Also Read : ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్ - మళ్లీ సినిమాలకు బ్రేక్, ఈసారి దేనికీ?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial