AV Raju Comments on Trisha: ఈ మధ్య హీరోయిన్‌ త్రిష పేరు వార్తల్లో, సోషల్‌ మీడియాలో మారుమోగుతుంది. 'లియో' మూవీ రిలీజ్‌ తర్వాత నటుడు మన్సుర్‌ అలీ ఖాన్‌ త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడి వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు త్రిషకు మద్దతు తెలుపుతూ సినీ ప్రముఖులు, నటీనటులు మన్సూర్‌ అలీ ఖాన్‌ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఇక ఆ సంఘటన మరువకముందే తాజాగా ఓ రాజకీయ నేత త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల బహిష్కరణకు గురైన అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు మాట్లాడుతూ గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకువచ్చాడు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.


ప్రస్తుతం అతడి కామెంట్స్‌ కోలీవుడ్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏవీ రాజు వ్యాఖ్యలపై ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు మండిపడుతున్నారు. త్రిషకు అండగా మేం ఉన్నామని, తనకు ఎప్పుడు మా మద్దతు ఉంటుందంటూ సినీ ప్రముఖుల సపోర్టు ఇస్తున్నారు. ఏవీ రాజును వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తనకు పలువురు సపోర్టుగా నిలుస్తున్న క్రమంలో ఏవీ రాజు కామెంట్స్‌పై స్పందిందించింది. ఈ క్రమంలో ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష స్పందించింది. ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ సీరియస్‌ అయ్యింది.






 






"ఫేమస్‌ కావడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. దీనిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నా లీగల్‌ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాను" అంటూ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం రీఎంట్రీ తర్వాత త్రిష వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. స్టార్‌, భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుంది. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీలో కుందవై పాత్రలో ఆకట్టుకుంది త్రిష. ఇందులో ఆమె అందం, అభియనంకు అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత లియో సినిమాలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్‌ సరసన విశ్వంభర సినిమాలలో నటిస్తుంది. చాలా గ్యాప్‌ తర్వాత త్రిష నటిస్తున్న తెలుగు సినిమా ఇది. ఈ మూవీకి త్రిష కూడా భారీగానే రెమ్యునరేషన్‌ అందుకుంది. ఇక ఆమె రీఎంట్రీతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్న క్రమంలో ఆమెను ఇలాంటి చేదు అనుభవాలను వెంటాడటంతో ఫ్యాన్స్‌ డిసప్పాయింట్‌ అవుతున్నారు.