టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంటుంది. ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. సినిమాల విషయంలో ఆమె కెరీర్ బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది సమంత. నాగ చైతన్యతో విడాకులు తర్వాత లైఫ్ లో చాలా స్ట్రగుల్ అయింది. ఈ విషయాన్ని తాను పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చింది. ఈ సమయంలోనే ఆమెకు ‘మయోసైటిస్’ అనే వ్యాధి రావడం కూడా ఆమె మరింత కుంగదీసిందనే చెప్పాలి. అయితే ఆ సమస్యలన్నిటినీ తానే పరిష్కరించుకొని మళ్లీ ఇప్పుడు ఫుల్ యాక్టీవ్ గా షూటింగ్ లలో పాల్గొంటుంది. తాజాగా సమంత గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ప్రేమ గురించి రాసుకొచ్చింది. దీంతో ఆమె మళ్లీ ప్రేమలో పడిందంటూ వార్తలు వస్తున్నాయి.


కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి: సమంత


నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా స్వేచ్ఛగా జీవిస్తుందనే వాదనలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆమె యాక్టివిటీలు కూడా ఉన్నాయి. సినిమాల్లో నటించడం, రిలేషన్స్ పై తన దృష్టి మారడం వంటి అంశాలపైనా కూడా సమంత చాలా క్లారిటీతో మాట్లాడుతోందనిపిస్తుంది. ముఖ్యంగా తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పొచ్చు. అందుకే సోషల్ మీడియాలో కూడా జీవితం గురించి ఇంట్రస్టింగ్ పోస్ట్ లు పెడుతూ తన అభిమానులను మోటివేట్ చేస్తుంది. అయితే ఒక్కోసారి ఆమె పెట్టే పోస్ట్ లు వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తాజాగా ప్రేమ గురించి చెప్తూ సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 'చావు నుంచి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు, కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి' అంటూ ఓ ప్రముఖ రచయిత చెప్పిన కొటేషన్ ను సమంత షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ చర్చలు స్టార్ట్ చేశారు. సమంత మళ్లీ ప్రేమలో పడిందని కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.


కెరీర్ లో దూసుకుపోతోన్న సమంత


హీరో అక్కినేని నాగచైతన్య, సమంత కలసి 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాలో నటించారు. ఈ మూవీ అప్పుడే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ 2017లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే 2021 లో ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. విడాకుల తర్వాత సమంత సినిమాల్లో మరింత బిజీ అయిపోయింది. ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ లో నటిస్తోంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ‘ఖుషి’ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. 


Also Read: విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడా? ఇదే సాక్ష్యమా?