Bollywood Hero Amirkhan in SSMB29: జ‌క్క‌న్న ఇప్పుడు పాన్ వ‌రల్డ్ డైరెక్ట‌ర్. 'ఆర్ ఆర్ ఆర్'కి  ఆస్కార్ రావడంతో ఆయ‌న రేంజ్ పెరిగిపోయింది. రాజమౌళితో సినిమాల కోసం బాలీవుడ్ లో కూడా ఎదురుచూస్తుంటారు. 'బాహుబ‌లి',  'ఆర్ ఆర్ ఆర్' తో అంత రేంజ్ కి ఎదిగిపోయారు. ఇక ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు జ‌క్క‌న్న. అప్పటి నుంచి దానికి సంబంధించి ఎలాంటి విష‌యాలు బ‌య‌టికి రాకుండా చూసుకుంటున్నారు మేక‌ర్స్. కానీ, సినిమా మాత్రం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. దానికి సంబంధించి ఏదో ఒక రూమ‌ర్ మాత్రం చకర్లు కొడ్తున్నాయి. ఇక ఇప్పుడు అదిరిపోయే అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా ఉన్నార‌ని. 


విల‌న్ పాత్ర‌లో.. 


రాజ‌మౌళితో న‌టించేందుకు బాలీవుడ్ స్టార్స్ కూడా రెడీగా ఉన్న‌ట్లు గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న రేంజ్ అంత‌లా పెరిగిపోయింది మ‌రి. ఇక ఇప్పుడు 'SSMB29'లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌మౌళి సినిమాలో అమీర్ ఖాన్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడ‌నే వార్త‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. 


ర‌హ‌స్య భేటీ.. 


ఇటీవ‌ల ముంబైలో రాజ‌మౌళి, అమీర్ ఖాన్ ఇద్ద‌రు ర‌హ‌స్యంగా భేటీ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇది ఆ సినిమాకి సంబంధించిన చ‌ర్చే అని ఫిలిమ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. 'లాల్ సింగ్ చ‌డ్డా'.. సినిమా అనుకున్నంత రీతిలో స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో అమీర్ ఖాన్ ఆచితూచి స్టోరీల‌ను ఎంచుకుంటున్నార‌ట‌. ఇక రాజ‌మౌళి సినిమాకి ఆయ‌న అందుకే.. ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్.. అంద‌రూ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. దీనికి సంబంధించి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కోసం వెయిట్ చేస్తున్నారు. 


హీరోయిన్ గా ఇండోనేషియా యాక్ట‌ర్.. 


రాజ‌మౌళి మ‌హేశ్ బాబు సంయుక్తంగా సినిమా అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే ఈ సినిమాపై విప‌రీత‌మైన క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకి సంబంధించి ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ సినిమాని కూడా రాజ‌మౌళి అదే రేంజ్ లో తీస్తున్నార‌ట‌. ఇండియానా జోన్స్ తెలుగు వెర్ష‌న్ ఈ సినిమా అనే అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇది దాదాపు రూ.వెయ్యి కోట్లతో తీస్తున్నార‌ట‌. ఈ సినిమాలో ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ మ‌హేశ్ బాబు స‌ర‌స‌న న‌టిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కే. ఎల్. నారాయ‌ణ ప్రొడ‌క్ష‌న్ లో రాబోతోంది. ఎంఎం కీర‌వాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే, ఆ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా చేస్తున్నారు.


ఇక ఇటీవ‌ల జ‌పాన్‌లో RRR ప్ర‌ద‌ర్శించారు. అప్పుడు రాజ‌మౌళి ఈ సినిమా గురించి మాట్లాడారు. ''నా నెక్స్ట్ సినిమా రైటింగ్ వర్క్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. అందులో నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు. ఒక్క కథానాయకుడిని తప్ప! సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తారు. హి ఈజ్ తెలుగు యాక్టర్. జపాన్ ప్రేక్షకులు చాలా మందికి ఆయన తెలుసు. వెరీ హ్యాండ్సమ్. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఆ సినిమా విడుదల కోసం మళ్లీ జపాన్ వస్తాను'' అని చెప్పారు రాజ‌మౌళి. ఇక అక్క‌డ కూడా ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫ్యాన్స్ ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. 


Also Read: ‘ఫ్యామిలీ స్టార్’ నాలుగో రోజు కలెక్షన్స్ - నెగిటివ్ రివ్యూలతో వసూళ్లకు గండి