Akhanda 2 Villain: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ‘ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2021లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ 2‘ తెరకెక్కించబోతున్నారు. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి.


అఖండ 2లో చైనీస్ విలన్?


ప్రస్తుతం ‘అఖండ 2‘ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కొనసాగుతున్నది. ఈ మూవీలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని లేదంటే నార్త్-ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నారు. అందరికీ తెలిసి, అద్భుతంగా యాక్టింగ్ లో అనుభవం, హావభావాలను అద్భుతంగా పలికించే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. సదరు యాక్టర్ వయసు 50 నుంచి 55 ఏండ్లు ఉండాలంటూ ఆడిషన్ ఇండియా ఇన్ స్టా పేజి ద్వారా ప్రకటన ఇచ్చారు. మరోవైపు ‘అఖండ 2‘ సినిమాలో ప్రైమరీ రోల్ కోసం 16 నుంచి 18 ఏండ్ల యువతిని తీసుకోనున్నట్లు ఆడిషన్ ఇండియా వెల్లడించింది. ఈ క్యారెక్టర్ కోసం మంచి టాలెంట్ ఉన్న ఇండియన్ అమ్మాయిని తీసుకోవాలనిభావిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రం ఏదైనా, భాష ఏదైనా ఫర్వాలేదని, అద్భుతంగా యాక్టింగ్  చేస్తే సరిపోతుందని ప్రకటించింది. ఇంతకీ ఈ సినిమాలో విలన్ ఛాన్స్ కొట్టేసే అదృష్టవంతుడు ఎవరో? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.    










అఖండ రుద్రసికిందర్‌ అఘోరా హామీ!


ఇక “కష్టం వచ్చినప్పుడు తలుచుకోమ్మా.. నీకోసం ఎక్కడున్నా తిరిగొస్తాను” అంటూ పాపకు అఖండ రుద్రసికిందర్‌ అఘోరా హామీ ఇవ్వడంతో ‘అఖండ’ సినిమా పూర్తవుతుంది. సీక్వెల్ కు అనుకూలంగానూ ‘అఖండ’ సినిమాకు ఎండ్ కార్డు వేశారు దర్శకుడు బోయపాటి. ఇప్పుడు ‘అఖండ 2’ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అఖండ రుద్రసికిందర్‌ అఘోరాగా బాలయ్య మరింత శక్తివంతంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ దేవాలయాలు, సనాతనధర్మానికి సంబంధించిన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ‘అఖండ-2’ తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కీలక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.   


బాబీతో బాలయ్య సినిమా


అటు ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ టైనర్‌ ‌‌‌‌‌‌‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలయ్య పూర్తి స్థాయిలో మాస్ లుక్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఊర్వశి రౌటేలా కీలక పాత్ర పోషించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 



Read Also: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ