సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'చంద్రముఖి' సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని చాలా రోజులుగా ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. కానీ అధికార ప్రకటన మాత్రం రాలేదు. రజినీకాంత్ సీక్వెల్ లో నటించడానికి ఆసక్తి చూపించడం లేదని కాబట్టి మరో హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉందని అన్నారు. 


దానికి తగ్గట్లే 'చంద్రముఖి2' సినిమా తాను చేయబోతున్నట్లు రెండేళ్ల క్రితం అనౌన్స్ చేశారు రాఘవ లారెన్స్. ఆ తరువాత మళ్లీ అప్డేట్ లేదు. ఇన్నాళ్లకు ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలోనే ఈ సినిమాను తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత సంస్థ లైకా.. 'చంద్రముఖి2'ని నిర్మించబోతోంది. 


పార్ట్ 1లో నటించిన కమెడియన్ వడివేలు పార్ట్ 2లో కూడా కనిపించబోతున్నారు. మరి మిగిలిన తారలను కూడా రిపీట్ చేస్తారేమో చూడాలి. 'చంద్రముఖి' సినిమాతోనే నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అంటే ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుందో లేదో మరి. ఇక లారెన్స్, పి.వాసు కాంబినేషన్ అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయనున్నారు. 


Also Read: పవన్ అంటే నాకు చాలా ఇష్టం - సాయిపల్లవి మాటలు విన్నారా?


Also Read: లేడీ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ - హీరోయిన్ ఎవరంటే?