దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. మెగా నందమూరి అభిమానులు థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. అభిమానులతో పాటు సినిమాను చూడడానికి సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. 


ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ కుటుంబాలతో కలిసి సినిమా చూసేశారు. రాజమౌళి ఫ్యాన్స్ తో కలిసి చూశారు. విమర్శకుల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అలానే మన సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ సినిమా మాములుగా లేదని.. ఇండియన్ సినిమా ప్రైడ్ ని పెంచిందంటూ దర్శకుడు రాజమౌళి, హీరోలకు హ్యాట్సాఫ్ చెప్పారు. 


అనీల్ రావిపూడి అయితే సినిమా గురించి చాలా గొప్పగా రాసుకొచ్చారు. 'రామ భీములు తొక్కుకుంటూ పోయారంతే' అంటూ ఒక్క మాటలో రివ్యూ చెప్పేశారు. అలానే హీరో సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ ఇలా చాలా మంది సినిమాపై స్పందించారు. వారేమన్నారో ఇక్కడ చూసేయండి!