యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు 'ఆర్ఆర్ఆర్' చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత తమ అభిమాన హీరోలు వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 


ఇదిలా ఉండగా.. సినిమా రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో సినిమా చూశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడగా.. రామ్ చరణ్, రాజమౌళి భ్రమరాంబ థియేటర్‌లో సినిమా చూశారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలతో కలిసి సినిమా చూశారు. సినిమా చూసిన తరువాత ఎన్టీఆర్ బయటకు వస్తూ.. సినిమా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ కి సంకేతాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 


సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉందట. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక డాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లలో ఇరగదీశారని.. అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' ఐఫీస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా.. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటించారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Also Read: 'ఆర్ఆర్ఆర్' సినిమా థియేటర్ లో ట్రాజెడీ, అభిమాని మృతి


Also Read: థియేటర్‌లో పేపర్లు విసురుతూ రచ్చ చేసిన ఉపాసన, వీడియో వైరల్