బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 11 కు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అందులో ఏకంగా రూ. 1,50,000 రూపాయలను గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. ఇక ఈ ప్రోమోలో చేతులు వణికితే చాలు అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉండడంతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు కొత్త రూల్ పెట్టారు. మరి ఈ టాస్క్ ఏంటి? ప్రోమో విశేషాలు ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి. 


చేతుల వణికితే ఛాన్స్ మిస్...
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఇన్ఫినిటీ మనీని ప్రైజ్ మనీగా గెలుచుకొనే అవకాశాన్ని కల్పించినట్టు ఈరోజు ఉదయం మొదటి ప్రోమో ద్వారా వెల్లడించారు. అయితే ఆ మనీని గెలవాలంటే మాత్రం టైం కోసం వెయిట్ చేయాలంటూ రూల్ పెట్టారు. బజర్ మోగగానే బిగ్ బాస్ చెప్పిన పనిని చేయాల్సి ఉంటుంది హౌస్ మేట్స్. టాస్క్ ను విజయవంతంగా ఎవరు పూర్తి చేస్తే వారి ఎకౌంట్లో మనీ యాడ్ అవుతాయి. ఉదయం చూపించిన ప్రోమోలో స్విమ్మింగ్ పూల్ లో దూకాల్సిన టాస్క్ లో విష్ణు ప్రియ విన్ అయినట్టుగా కనిపించింది. ఆ తర్వాత టాస్క్ లో పృథ్వీ, నిఖిల్ ఇద్దరూ గట్టిగానే పోటీపడ్డారు. ఇక తాజా ప్రోమో విషయానికి వస్తే ఇందులో బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం విలువ ఏకంగా లక్షా యాభై వేల రూపాయలు. అయితే దాన్ని సంపాదించుకోవడానికి హౌస్ మేట్స్ ఆరెంజ్ జ్యూస్ ను గ్లాస్ లో నిండుగా పోయాల్సి ఉంటుంది. ఒక్క చుక్క కిందపడినా ఆ క్లాన్ సభ్యుడు ఈ లక్షన్నర ను దక్కించుకునే అవకాశాన్ని కోల్పోతాడని బిగ్ బాస్ ప్రకటించారు. ఇక టాస్క్ లో అభయ్, ఆదిత్య, నిఖిల్ పాల్గొన్నట్టుగా ప్రోమోలో చూపించారు. వాళ్ళు జ్యూస్ ను పోస్తున్నప్పుడు చేతులు వణుకుతున్నట్టుగా కూడా కన్పించింది. అయితే ఇందులో ఎవరు గెలిచారు అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. ఆ తర్వాత 50,000 టాస్క్ ఇచ్చి పృథ్వి, నిఖిల్, నబిల్ వ్యాక్స్ చేయించుకోవాలని ఛాలెంజ్ విసిరారు బిగ్ బాస్. 


Read Also : Citadel Diana OTT Release Date: ఓటీటీలోకి ఫ్యూచరిస్టిక్ స్పై థ్రిల్లర్ 'సిటాడెల్ డయానా' - ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?


యష్మీ, విష్ణు ప్రియ మధ్య చికెన్ గొడవ 
ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో ప్రతి రోజూ ఫుడ్ గొడవే నడుస్తోంది. ఈ ముహూర్తన సీజన్ ను మొదలు పెట్టారో తెలియదు కానీ మొదటి రోజు గుడ్డు నుంచి మొదలైన ఈ గొడవ ఇంకా ఫుడ్ కు సంబంధించి నడుస్తూనే ఉంది. తాజా ప్రోమోలో పాల ప్యాకెట్ దగ్గర మొదలైన గొడవ చికెన్ దాకా వెళ్ళింది. "మా చికెన్ మీరు తీసుకున్నారు" అని విష్ణు ప్రియ అనడంతో, యష్మీ "నీ దగ్గర ప్రూఫ్ ఉందా ? ఎవరు చెప్పారు మేము తీసుకున్నామని?" అంటూ విరుచుకుపడింది. "ఎందుకు అరుస్తున్నావ్?" అని విష్ణు ప్రియ ప్రశ్నిస్తే... "నేను ఇలాగే మాట్లాడుతాను" అంటూ మరింత గట్టిగా సమాధానం చెప్పింది. మొత్తానికి ఈ రెండు ప్రోమోల ద్వారా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అని ఆసక్తి మాత్రం పెరిగిపోయింది. మరి ఏ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు? ఎంత ప్రైజ్ మనీని సంపాదించారు? అనేది చూడాలి. 


Read Also :Bigg Boss Telugu Season 8 Promo: ఇన్ఫినిటీ ప్రైజ్ మనీ కోసం బొక్క బోర్లా పడ్డ సోనియా... నిఖిల్, పృథ్వీ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్, మనీ కోసం కుస్తీ