Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో మామూలుగా టాప్ 5 కంటెస్టెంట్స్ ఫైనల్స్‌కు చేరుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఆరుగురు కంటెస్టెంట్స్.. ఫినాలే వీక్‌కు చేరుకున్నారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు ఛాన్సులు ఉన్నాయని, ఆరుగురి నుంచి ఒక కంటెస్టెంట్.. ఫినాలే వీక్‌లో ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్లిపోతుందని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు.. ఫైనల్‌గా ఫైనల్స్‌‌కు షూటింగ్ మొదలయ్యింది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేసి బయటికి పంపించారని.. ప్రస్తుతం హౌజ్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారని సమాచారం. అయితే, అర్జున్, ప్రియాంకలు ఖాళీ చేతులతో హౌస్ నుంచి బయటకు వెళ్లగా. యావర్ మాత్రం తెలివిగా రూ.15 లక్షలతో ఫినాలే రేసు నుంచి తప్పుకున్నాడని తెలిసింది.


టాప్ 6 నుంచి ముగ్గురు ఎలిమినేట్..
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7కు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ రన్నర్‌గా ఎవరు ఉంటారు? టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ముందుగా ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే ప్రశ్నలకు ఫైనల్‌గా సమాధానం దొరికినట్టుగా అనిపిస్తోంది. ఫినాలే అస్త్రా సాధించినా కూడా ఓటింగ్ విషయంలో అర్జున్ లాస్ట్‌లో ఉన్నాడని నాగార్జున ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే రెండు వారాల్లో అర్జున్ ఓటింగ్‌లో ఏ మార్పు రాలేదు. అందుకే ముందుగా బిగ్ బాస్ సీజన్ 7లోని టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుంచి అర్జున్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. తనతో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయారట.


యావర్ ఓట్లకు గండి..
బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ కలిసి ‘స్పై’ అనే బ్యాచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ బ్యాచ్‌కు సపోర్ట్ చేసేవారి ఓట్లు చీలిపోయాయి. టాస్కుల్లో యాక్టివ్‌గా ఉంటూ ఎక్కువశాతం టాస్కుల్లో గెలిచిన పల్లవి ప్రశాంత్‌కు కొందరు ఓట్లు వేస్తే.. మరికొందరు మాత్రం చాకచక్యంగా ఆలోచించి, ఎత్తుకు పైఎత్తులు వేసే శివాజీకి ఓట్లు వేశారు. దీంతో యావర్ ఓట్లకు గండిపడింది. ఎక్కువ ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్, శివాజీలకు ఎక్కువగా ఓట్లు పడడంతో యావర్‌కు వచ్చే ఓట్ల శాతం తగ్గిపోయింది. దీంతో అర్జున్‌తో పాటు యావర్ కూడా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయినట్టు సమాచారం.


టాప్ 3 చేరుకున్న ఆ ముగ్గురు..
అర్జున్, యావర్‌తో పాటు ప్రియాంక కూడా బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేసినట్టు సమాచారం. అర్జున్‌లాగానే ప్రియాంకకు కూడా చాలా తక్కువ ఫ్యాన్‌బేస్ ఉంది. అందుకే ఓట్ల విషయంలో తన ఫ్యాన్స్ అంతా కలిసినా కూడా టాప్ 3 స్థానానికి తన ఫేవరెట్ కంటెస్టెంట్‌ను చేర్చలేకపోయారు. కానీ తన ఆటను మాత్రం చాలాకాలం వరకు బిగ్ బాస్ ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక ప్రియాంక, యావర్, అర్జున్ ఎలిమినేట్ అయిపోవడంతో.. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్ మాత్రం టాప్ 3 స్థానాలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ టాప్ 3 కంటెస్టెంట్స్‌లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: ప్రజల ‘పల్లవి’ - ప్రశాంత్.. ప్లస్, మైనస్‌లు ఇవే, గురూజీని ముంచేస్తాడా?