New Task in Biggboss 8 : బిగ్​బాస్​లో నామినేషన్స్​ లొల్లి ముగిసింది. కంటెస్టెంట్లు నార్మల్​గా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నాడేమో కానీ.. బిగ్​బాస్ వెంటనే న్యూ టాస్క్​తో వచ్చేశాడు. హోరా హోరీన జరిగిన నామినేషన్స్​లో బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ ఈ వారం లిస్ట్​లో ఉన్నారు. వారికి హోజ్​లో ఉండే సత్తా ఉందని నిరూపించుకునేందుకు ఈ టాస్క్​ పనికొస్తుంది. ఇంతకీ బిగ్​బాస్ ఇచ్చిన టాస్క్​ ఏంటి? ప్రోమోలో ఏమి చూపించారంటే..


ఎవర్రా మీరంతా..


ప్రోమో స్టార్టింగ్​లో కామెడి ట్రాక్ పెట్టారు. పృథ్వీరాజ్ సీరియస్​గా బ్రష్​కి ఫేస్ వాష్​ పెట్టుకుని బ్రష్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో అక్కడున్న నిఖిల్ నువ్వు ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నావా అని అడిగితే అవును అని పృథ్వీ చెప్తాడు. అది టూత్ పేస్ట్ కాదు.. ఫేస్ వాష్ అనగానే అందరూ నవ్వేస్తారు. అప్పటివరకు పృథ్వీ కూడా ఈ విషయం రియలైజ్ అవ్వడు. మిగిలిన హోజ్ మెంబర్స్​ అంతా రోజూ ఇలానే బ్రష్ చేసుకుంటున్నావా అంటూ పృథ్వీని టీజ్​ చేశారు. నిఖిల్ కూడా ఎవర్రా మీరంతా అనడంతో అందరూ నవ్వుతూ సెటైర్స్ వేసి పృథ్వీని టీజ్ చేశారు. 


న్యూ టాస్క్​.. 


సైన్యం లేని రాజు.. రాజు కాలేడు అంటూ బిగ్​బాస్​ చెప్తూ.. కొత్త టాస్క్​ గురించి వివరించాడు. చీఫ్ పవర్​ఫుల్​ అవ్వడానికి చీఫ్​కి ఒక క్లాన్​ కావాలి. ఛీప్స్​ వారి క్లాన్స్​ని నిర్మించుకోవడానికి సమయం ఆసన్నమైంది. అంటూ యాశ్మీ, నిఖిల్, నైనికను ఉద్దేశించి బిగ్​బాస్ చెప్పాడు. ఈ టాస్క్​ కోసం నామినేషన్స్ సమయంలో ఇచ్చిన గొలుసులను వారు వేసుకున్నారు. ఛీప్స్ వారి టీమ్స్​ను రెడీ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది అంటూ.. కంటెస్టెంట్లను మూడు టీమ్స్​గా విడగొట్టేందుకు బిగ్​బాస్ ప్రయత్నించాడు. 


స్ట్రేటజీలు ఇవే..


ఈ సమయంలో యాశ్మీ, నిఖిల్, నైనిక.. తమకి ఏ కంటెస్టెంట్ కావాలో వారిని తమ టీమ్​లోకి తీసుకునేందుకు చూస్తున్నారు. తమ తమ రీజన్స్ చెప్పి క్లాన్స్​ని బిల్డ్ చేసుకోవడానికి యత్నిస్తున్నారు. యాశ్మీ.. మణికంఠతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో నా క్లాన్స్ గెలవాలి అంటూ మోటివేట్ చేస్తుంది. నిఖిల్ కూడా విష్ణుప్రియతో మాట్లాడుతూ.. నా టీమ్ తప్పు చేసినా.. అక్కడే డిఫెండ్ చేసుకుని.. తర్వాత సాల్వ్ చేసుకోవాలంటూ తన స్ట్రేటజీ చెప్తూ కనిపించాడు. 



తప్పు చేస్తే మాట్లాడేయండి..


నైనిక కూడా మణికంఠతో మాట్లాడుతూ.. అనవసరమైన గొడవలు కూడా వద్దు అంటూ తేల్చచి చెప్పింది. పాయింట్ నచ్చకపోయినా.. తప్పు చేసినా.. ట్రిగర్ అయినా మాట్లాడండి. అది ఏదైనా సరే అంటూ మణికంఠకి తెలిపింది. అనంతరం తమకు కావాల్సిన కంటెస్టెంట్లు టీమ్​లోకి వస్తున్నారా లేదా అనేది ప్రోమోలో చూపించారు. 


స్ట్రెంత్, మైండ్ నా దగ్గరుంది..


నా క్లాన్​కు తన అవసరముందని నేను ఫీల్​ అవుతున్నాను. అన్ని రకాలుగా తను నాతో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అంటూ తెలిపింది. అయితే ప్రోమోలో విష్ణుప్రియను, ప్రేరణను బిగ్​బాస్ చూపించారు. నాకు స్ట్రెంత్ దొరికింది, మైండ్ దొరికింది. నేను ఎంటర్​టైన్​మెంట్​ నుంచి వచ్చాను కాబట్టి ఐ వాంట్​ మై ఎంటర్​టైన్​మెంట్ అంటూ చెప్పింది నైనిక. ఆ సమయంలో ఆదిత్య ఓంని చూపించారు ప్రోమోలు. 


ఆడపులిగా డిక్లేర్ చేసుకున్న సోనియా


స్మార్ట్​నెస్, ఇంటిలిజెన్స్​.. చాలా అబ్జర్వ్ చేస్తారు. పాయింట్ అవుట్ కూడా చేస్తారు అంటూ నిఖిల్ చెప్పాడు. నవీన్ మాట్లాడుతూ నన్ను నేను కొంచెం స్ట్రెచ్​ చేసుకుందామనే ఈ హౌజ్​లోకి వచ్చాను కాబట్టి ఐ యామ్ చూజింగ్ హర్ అంటూ నైనికను చూపించారు. సోనియా మాట్లాడుతూ.. ట్రూ కలర్​ ఆఫ్ హిమ్.. మనుషులను గెలుచుకుంటున్నాడో లేదో చూడాలి. ఈ ఆడ పులితో ఫైట్ చేస్తేనే.. పవర్​ ఫుల్ అయితాది అంటూ నిఖిల్​ని చూపించింది. 


టీమ్స్ ఇవే..


ప్రోమో ముగిసే సరికి నిఖిల్ దగ్గర మణికంట, బేబక్క, సోనియా ఉండగా.. ప్రోమోలో యశ్మీ దగ్గర శేఖర్ బాష, పృథ్వీరాజ్, నవీన్, ప్రేరణ ఉన్నారు. నైనిక దగ్గర విష్ణుప్రియ, ఆదిత్య ఓం, సీత, నఫ్రీద్ ఉన్నారు. 


Also Read : బిగ్​బాస్​ నామినేషన్స్​​లో గుడ్డు పంచాయతీ.. అమ్మ సెంటిమెంట్​తో ఏడిపించేసిన మణికంఠ.. ఏదోలోకంలో ఉన్న ఆదిత్య