బిగ్ బాస్ షోలో.. 8వ వారం కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్‌లో గెలుపొంది కంటెండర్స్ గా నిలిచారు. ప్రియాంక, పల్లవి ప్రశాంత్, సందీప్, శోభా శెట్టి, గౌతమ్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చారు. అదే ఈ మిర్చి చాలా హాట్. ఈ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ కండైనర్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారు అనేది మిగతా ఇంటి సభ్యులు నిర్ణయించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమోలో అమర్ పల్లవి ప్రశాంత్ ని, భోలే ప్రియాంకను.. రతిక, యావర్ శోభాశెట్టిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగిస్తూ నామినేట్ చేశారు.


ఈ క్రమంలోనే వాళ్ల మధ్య డిస్కషన్ తో పాటు కాసేపు వాదోపవాదాలు కూడా జరిగాయి. ముఖ్యంగా యావర్, శోభ శెట్టిల మధ్య పెద్ద వారే జరిగింది. శోభ శెట్టి యావర్ ని పిచ్చోడివి అనగానే చాలా సీరియస్ అయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మిగతా కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ నే టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఒకసారి ప్రోమోని గమనిస్తే... పిచ్చోడు అనేది బ్యాడ్ వర్డ్ అని రతిక యావర్ తో చెబుతుంది. అమ్మాయి అయితే ఏదైనా అనొచ్చా అని యావర్ అంటే దానికి రతిగా బదిలిస్తూ.. ‘‘అమ్మాయి అయితే ఏదైనా మాట్లాడొచ్చనేది కరెక్ట్ కాదు’’ అని అంది. తర్వాత శోభ.. "నువ్వు నామినేట్ చేసిన రీజన్ ఏమిటి" అని తేజపై ఫైర్ అయింది.


"ఐదుగురిలో ముగ్గురు మాత్రమే వేరే వాళ్లకు ఇస్తారు. ప్రశాంత్ ని ఎవరు ముట్టుకోరు. నాకు తెలుసు" అని అమర్ రతికతో చెప్తాడు. ఆ తర్వాత అమర్.. "పంట పండించే వాడివి పంచుకోవడం కూడా తెలియాలి నీకు, ఏదైనా చెప్పినప్పుడు తొడలు కొట్టేది, మీసాలు మెలేయడం, పక్కవాళ్ళు నవ్వితే చంకలు గుద్దుకోవడం అలాంటిది కాదు" అని ప్రశాంత్ పై ఫైర్ అవుతాడు. తేజ కూడా ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ.. ‘‘నువ్వు కెప్టెన్ అయ్యావు. మిగతావాళ్లు అవలేదు. వాళ్ళకి అవకాశం రావాలి’’ అని రేస్ నుంచి తొలగిస్తాడు. దానికి ప్రశాంత్ బదులిస్తూ.. "ఈ మాల వేస్తుంటే మా రైతులు పండించిన పంట నాకు పూలమాల లెక్క కనిపిస్తుంది. నాకు సంతోషంగా ఉంది. మంచితనానికి మంచి మంచి దండలు వస్తుంటే ఎవరు వద్దంటారు" అని ప్రశాంత్ మిగతా హౌస్ మెట్స్ తో అంటాడు.


ఆ తర్వాత ప్రియాంక.. "గట్స్ ఉంటే రీజన్ చెప్పి తీయండి" అని బోలేని పరోక్షంగా అంటుంది. అందుకు భోలే.." ఆమె ప్రతిదానికి చాలా ఇరిటేట్ గా ఫీల్ అవుతుంది" అని రతికతో చెప్తాడు. "నీ ఇరిటేషన్ లో నువ్వు ఉన్నప్పుడు మా ఇరిటేషన్ లో మేము ఉంటాం కదా" అని ప్రియాంక అంటుంది. ఇక అశ్విని వంతు వచ్చినప్పుడు.." ప్రశాంత్ ఈ డిజర్వ్, అన్ డిజర్వ్ లో తీయడానికి అసలు ఇక్కడ ఎవరికీ అర్హత లేదు" అని అనగానే టేస్టీ తేజ.." ప్రశాంత్ ని తీయడానికి ఇక్కడ ఎవరికీ అర్హత లేదు అన్నావ్. అసలు ఆ స్టేట్మెంట్ ఏంటి?" అని తేజ అశ్వినీని అడుగుతాడు. వాళ్లను నేనేమీ అనలేదు అని అశ్విని సమర్ధించుకుంటుండగా తేజ.. "ఇక్కడున్న ఎవ్వరికీ అర్హత లేదు అన్నావు. నువ్వు ఎవరు చెప్పడానికి?" అంటూ అశ్విని పై ఫైర్ అవుతాడు. "నేను ఆపోజిట్ లో ఉన్నంతవరకు అయిన వాళ్ళను ఇంకోసారి అవ్వనివ్వను" అంటూ అమర్ దీప్ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.



Also Read : నువ్వు పిచ్చోడివి అంటూ రెచ్చగొట్టిన శోభ.. మిర్చిదండ నేలకేసి కొట్టిన యావర్




Join Us on Telegram: https://t.me/abpdesamofficial