బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బెజవాడ బేబక్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. హౌజ్ లో కిచెన్ సెంటిమెంట్ తో పాటు, తాను చేసిన తప్పులను, ఓ గ్యాంగ్ అంతా కలిసి గేమ్ ఎలా ఆడుతున్నారు అనే విషయాలను, అలాగే నిఖిల్ టీమ్ నుంచి తనకు వచ్చిన బెదిరింపుల గురించి వెల్లడించింది. 


నిఖిల్ టీం నుంచి బెదిరింపులు


బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బేబక్క బయట పెడుతున్న విషయాలు షాక్ కు గురి చేస్తున్నాయి. తాను నిఖిల్ ను గొర్రెలా నమ్మి బలిపశువును అయ్యానని ఆవిడ చెప్పారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తనకు నిఖిల్ టీమ్ నుంచి తనకు కాల్ వచ్చిందని, వాళ్లు బయట ఇంటర్వ్యూలలో నిఖిల్ గురించి ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడొద్దని అంటున్నారంటూ బేబక్క స్వయంగా వెల్లడించింది. అయితే తనకు ఏమనిపించిందో అదే చెప్తాను అంటూ నిఖిల్ టీంకి సదరు ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చింది. అలాగే కిచెన్ లోనే క్రైమ్స్ అన్నీ వండుతారని నాకు తెలియదు. తెలిసి ఉంటే ఏదో ఒక హెల్ప్ మాత్రమే చేసి వాళ్ళలాగే సేఫ్ గేమ్ ఆడేదాన్ని అంటూ కిచెన్ లో అడుగు పెట్టిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అనే సెంటిమెంట్ గురించి మాట్లాడింది.    


Read Also: ఒక్కొక్కరుగా మాస్క్ తీస్తున్న కంటెస్టెంట్స్



సోనియా అసలు స్ట్రాటజీ ఇదేనా?


ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెనకాల ఉంటే నెట్టుకు రావచ్చు అనే ఉద్దేశంతోనే నిఖిల్ వెనక కావాలని ఉన్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ తన లాంటి కంటేస్టెంట్ తో ఆడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే అతనితో కలిసి అడాను. కానీ అతనికి నేను టీంలోకి వచ్చాను అనే ఆనందం కన్నా సోనియా రాలేదు అనే బాధనే ఎక్కువ. సోనియా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవతలి వైపు ఉంటే తనకే ముప్పు అనే ఆలోచనతో తనను వీక్ కంటెస్ట్ అనుకున్నాడు నిఖిల్ అని చెప్పుకొచ్చింది. అభయ్ గురించి మాట్లాడుతూ ఈ వర్గం ఆ వర్గం కలిసికట్టుగా ఉన్నారు అంటూ సోనియా, అభయ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ''హౌస్ లో ఓ గ్యాంగ్ ముందే బయట ప్లాన్ చేసుకొని, హౌస్ లో పక్కా స్ట్రాటజీతో గేమ్ ఆడుతుంది. చీఫ్ లు గా ఎప్పుడైతే పదవులు వచ్చాయో అక్కడి నుంచి నాకు ఎవరెవరు ముందే మాట్లాడుకొని హౌజ్ లోకి వచ్చాక గ్యాంగ్ లుగా మారారో ఐడియా వచ్చింది. కానీ ఎవరు, ఏంటి అనే విషయాన్ని మాత్రం చెప్పను'' అని కుండబద్దలు కొట్టింది. ''ఒక టీం అయితే ఉంది, వాళ్ళు మిగతా 5-6 మందిని తొక్కి బయటకు తోస్తారు. అందులో ఫస్ట్ నేను బలిపశువును అయ్యాను'' అంటూ బిగ్ బాస్ లో జరుగుతున్న గూడుపుఠాణీ గురించి బయటపెట్టారు. అయితే బేబక్క ఇన్ డైరెక్ట్ గా చెబుతున్న ఆ గ్యాంగ్ నిఖిల్, పృథ్వీ, అభయ్, సోనియా అని అనుకుంటున్నారు నెటిజెన్లు. ఎందుకంటే తాజా ఎపిసోడ్ లో సోనియా మనకంటే ముందు వెళ్లాల్సిన వాళ్లు ఐదారు మంది ఉన్నారు. అప్పటిదాకా మనం సేఫ్ అంటూ మరో కంటెస్టెంట్ తో చెప్పింది. 


Read Also: ఆడపులికి కాబోయే వాడు ఇన్ని లక్షణాలు ఉండాలట, అలాంటి వాడు అసలు భూమ్మీద ఉన్నాడా?