Bigg Boss Telugu 9 Latest Emotional Promo : బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో వచ్చింది. పొద్దున్న ఇచ్చిన ప్రోమోతో అందరినీ నవ్వించేసిన బిగ్​బాస్ ఇప్పుడు అందరినీ ఏడ్పించేశాడు. బిగ్​బాస్ హోజ్​లోకి వచ్చి మూడు వారాలే అయినా కూడా కంటెస్టెంట్​లో ఇంటికి దూరంగా ఉంటూ తమ వారిని మిస్​ అవుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా బిగ్​బాస్​ ముందుగానే ఇంటి నుంచి సందేశాలు తీసుకొచ్చేశాడు. దీంతో అప్పటితో నవ్వులతో నిండిపోయిన బిగ్​బాస్​ హోజ్​.. ఈ న్యూస్​తో ఎమోషనల్​గా మారిపోయింది. 

Continues below advertisement

బిగ్​బాస్​ ప్రోమోలో ఏముందంటే..

బిగ్​బాస్​ కంటెస్టెంట్లకు ఇంటి నుంచి మెసేజ్ తీసుకొచ్చేశాడు. కానీ వాటిని పొందాలంటే ఆడి సంపాదించుకోవాలంటూ ట్విస్ట్ పెట్టాడు. ఫ్యామిలీ నుంచి మెసేజ్​లు వచ్చాయని చెప్పేసరికే అందరూ ఎమోషనల్ అయిపోయారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ పంపించిన లెటర్స్, మెసేజ్లు పొందాలంటే.. గేమ్ ఆడాలని చెప్పాడు. అంతేకాకుండా 100 పర్సెంట్ ఉన్న బ్యాటరీని కూడా డిస్​ప్లే చేశారు. గేమ్​ ఆడి గెలిచి.. మెసేజ్ తీసుకుంటే లేదా ఇతర విధానాల బట్టి బ్యాటరీ తగ్గుతుందని చెప్పాడు బిగ్​బాస్. దీనిలో భాగంగా నిర్వహించిన గేమ్​లో ఇమ్మాన్యూయేల్ గెలిచాడు. 

Continues below advertisement

ఇమ్మూ గెలిచి కన్ఫెషన్ రూమ్​లోకి వెళ్లగా మీకు లెటర్ కావాలన్నా.. వాయిస్ రికార్డ్ కావాలన్నా బ్యాటరీ తగ్గుతుంది. అయితే తర్వాత ఇంట్లోవారి మెసేజ్ చూడాలనుకునేవారికి కొంతే బ్యాటరీ ఉందని చెప్పడంతో ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లో దాదాపు అందరూ తమ వారితో మాట్లాడాలని చూస్తున్నారని చెప్పాడు. ముఖ్యంగా తనూజ, సంజన, సుమన్ ఇలా ఇంట్లో వారిపై బెంగతో ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. వారికోసం వదిలేయాల వద్దనే ఆలోచనలో ఏడుస్తూ.. నేను ఏడిస్తే మా అమ్మ చూడలేదు బిగ్​బాస్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

మొత్తానికి ఈ వారం ఇలా ఇంట్లో వారి మెసేజ్​లు ఇస్తూనే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేశాడు బిగ్​బాస్. అయితే ముందుగా వచ్చే సెలబ్రెటీలు, కామనర్స్ డమ్మీ కంటెస్ట్​లనే బజ్ ఎక్కువగా వినిపిస్తుంది. దీని తర్వాత రియల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా సీజన్ 9 పై ఆసక్తిని కలిగించేలా బిగ్​బాస్ టీమ్ ప్లాన్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే కచ్చితంగా ఎమోషనల్ రైడ్​గా ఉండనుంది.