‘బిగ్ బాస్’ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)లో వీకెండ్ ఎపిసోడ్స్ టేలికాస్ట్ రేడీ అయ్యాయి. శనివారం ప్రసారం కానున్న నాగార్జున ఎపిసోడ్‌లో కార్తీ స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. ‘జపాన్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కార్తీ.. హోస్ట్ నాగార్జునతో సందడి చేశాడు. ఈ సందర్భంగా నాగ్.. కార్తీకి బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ను పరిచయం చేశాడు. కంటెస్టెంట్లలో ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా అశ్వినీ, శోభాలను ఆటపట్టించారు. ప్రియాంకకు మాత్రం మరిచిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చారు. 


పుల్లలు పెడుతున్న అశ్వినీ.. పరువు పోయిందిగా


కార్తీ స్టేజ్ మీదకు రాగానే.. నాగ్ ‘‘నీలా జపాన్ క్యారెక్టర్లు హౌస్‌లో చాలామందికి ఉన్నాయ్’’ అని అన్నారు. ఇందుకు కార్తీ.. ‘‘డార్క్, డార్కెన్, డార్కెక్టెస్టా’’ అని అన్నాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్‌కు కార్తీని చూపిస్తూ ‘‘నా తమ్ముడిని తీసుకొచ్చాను’’ అని చెప్పారు. ‘‘సినిమాల్లో బ్యాడ్, గుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ, ఈ సినిమా మొత్తం బ్లాకే’’ అని అన్నాడు కార్తీ. ఈ సందర్భంగా నాగ్.. ‘‘నేను నీకు మా హౌస్‌లో డార్క్ సైడ్స్‌ను పరిచయం చేస్తా’’ అని అన్నారు. ముందుగా అశ్వినీ గురించి చెబుతూ.. ‘‘అందమైన ఆడపిల్ల. కానీ, అందరికీ పుల్లలు పెడుతుంది’’ అని అన్నారు. అశ్వినీ నో సార్ అనడంతో.. ‘‘కాసేపటి తర్వాత మాట్లాడుకుందాంలే’’ అని నాగార్జున అన్నారు. 


ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతానికి మనకు కనిపించేది రామం క్యారెక్టర్. నామినేషన్స్ రోజు అపరిచితుడు బయటకు వస్తాడు’’ అని తెలిపారు. ప్రియాంక గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ అమ్మాయికి ఎంత చూద్దామన్నా.. డార్క్ సైడ్ కనిపించడం లేదు’’ అని కితాబిచ్చారు నాగ్. ‘‘ఈ మాటే చాలు సార్. వేరీ హ్యాపీ టుడే’’ అని ప్రియాంక తెలిపింది. ఆ తర్వాత శోభాశెట్టి గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు డార్క్ సైడు గురించి చెబుతా. నేనెందుకులే తేజా నువ్వు చెబుతావా ఆమె డార్క్ సైడ్’’ అని అడిగారు నాగ్. ఇందుకు తేజా.. ‘‘నన్ను ఇన్వాల్వ్  చేయకండి’’ అని తప్పించుకోడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. ‘‘నిజాయతీగా శోభా డార్క్ సైడ్ చెప్పు’’ అని అన్నారు. దీంతో తేజా ‘‘మీరు అనుకున్నదే సార్’’ అని అన్నాడు. ఈ లోగా అమర్‌దీప్.. నేను చెబుతా అన్నట్లుగా నిలుచున్నాడు. దీంతో నాగ్.. ‘‘నేను నిన్ను నిలబడమన్నానా?’’ అన్నారు నాగ్. దీనికి కార్తీ.. ‘‘ర్యాగింగ్‌లా ఉంది’’ అని అన్నాడు. చివరిలో.. మిగతా హౌస్‌మేట్స్‌తో మాట్లాడిల్సినది చాలా ఉందంటూ భయపెట్టారు నాగ్. కార్తీ వెళ్లగానే.. ఈ వారంలో హౌస్‌మేట్స్ చేసిన తప్పులను నాగ్ కడిగేయనున్నారని ఈ ప్రోమోతో స్పష్టమవుతోంది. ముఖ్యంగా శివాజీ, గౌతమ్ మధ్య పెద్ద పంచాయతీనే జరగనుంది. అలాగే అమర్‌దీప్, అశ్వినీలు కొట్టుకోవడంపై కూడా నాగ్ ప్రశ్నించే అవకాశం ఉంది. 


‘బిగ్ బాస్’ శనివారం ఎపిసోడ్ ప్రోమోను ఇక్కడ చూడండి:



Also Read: అందుకే సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ చెల్లి షాకింగ్ కామెంట్స్