Bigg Boss 8 Telugu Day 10 Episode 11 Review:   బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం టాస్కులు మొదలయ్యాయి. ఇక మూడు క్లాన్స్‌కు రేషన్స్‌ను సంపాదించే బాధ్యతల్ని చీఫ్‌‌ల మీద పెట్టాడు బిగ్ బాస్. ముందు స్టోరూంలోంచి సామాన్లను తెచ్చుకోమన్నాడు. పెద్ద క్లాన్ కావడంతో యష్మీకి ఎక్కువ టైం ఇచ్చాడు. ఇక నిఖిల్, నయనికి, యష్మీలు తమ తమ సామర్థ్యం మేరకు వస్తువులు తెచ్చుకున్నారు. కానీ వాటిని సొంతం చేసుకునేందుకు టాస్కులు పెట్టాడు. రెండు టాస్కులు ఇస్తానని, మూడు క్లాన్స్ నుంచి ఇద్దరే ఆ టాస్కులను గెలుస్తారు. ఓడిన ఆ ఒక్క క్లాన్‌కు రేషన్ ఉండదు. 


Read Also: అమ్మో బేబక్క వాచ్ ధర అన్నీ కోట్లా!? ఏ ప్లానెట్ నుంచి తెచ్చిన మెటలో తెలిస్తే ఫ్యూజులు ఔట్


అలా మొదటి టాస్క్.. లెమన్ పిజ్జాలో అద్భుతంగా ఆడి అభయ్, పృథ్వీలు టాస్కుని గెలుస్తారు. దీంతో యష్మీ క్లాన్ విన్ అవ్వడం.. యష్మీ సాధించిన సరుకులు మొత్తం ఆమె క్లాన్‌కు చెందాయి. ఇక రెండో టాస్క్‌లో కనిపెట్టు.. పరిగెత్తులో నయనిక విన్ అయింది. తనకు అన్యాయం జరిగిందంటూ సంచాలక్ యష్మీ మీద మణికంఠ ఫైర్ అయ్యాడు. పావుకిలో అంటే ఎగ్జాక్ట్‌గా ఎవ్వరూ తీసుకు రారు.. దానికి దగ్గర్లో ఉన్నది కన్సిడర్ చేయాలని మణికంఠ వాదించాడు. కానీ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం అని యష్మీ కాస్త ఎక్స్ ట్రా చేసింది.


అవతర ఆరుగున్నారని.. అక్కడ మణికంఠకు పాయింట్ ఇస్తే టై అవుద్దని.. ఆరుగురు పస్తులుండాల్సి వస్తుందని.. ఇవతల ఇద్దరే ఉన్నారు కదా? అని అలా నిర్ణయం తీసుకుందట యష్మీ. అలా చివరకు నయనిక టీం విన్ అయింది. వారికి రేషన్ వచ్చింది. నిఖిల్, మణికంఠలకు రేషన్ కట్ అయింది. వాళ్లకి రాగి పిండి ఇచ్చాడు. దాంతోనే వారమంతా గడపమని అన్నాడు. అయితే ఈ రేషన్‌ను కాపాడుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. అంటే ఆ రేషన్‌ను దొంగిలించుకోవచ్చని చెప్పకనే చెప్పేశాడు.


Read Also: నా లవ్ బ్రేకప్ కు కారణం ఆవిడే... బిగ్ బాస్ యాష్మీ గౌడ షాకింగ్ కామెంట్స్


ఇక ఈ నిఖిల్ నామినేషన్ నాటి ఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లో ఉండాలనిపించడం లేదని, తన వల్ల కావడం లేదని బాధపడ్డాడు. కానీ ప్రేరణ మాత్రం నిఖిల్‌కు పాజిటివ్ మాటలు చెప్పి ఉత్తేజ పర్చింది. ఇక నిఖిల్ మరోసారి నయనిక వద్ద బాధపడుతూ కనిపించాడు. ఎమోషనల్ ఫూల్ అని నయనిక అనేసింది. బాధను బయటపెడితే.. ఎమోషన్‌ను బయటపెడితే ఒక బాధ.. పెట్టకపోతే ఇంక బాధ అంటూ నిఖిల్ కాస్త కన్నీరు కార్చేశాడు. మరో వైపు సీత ఏదో మాట అనేసిందని విష్ణుప్రియ బాధపడింది.


మణికంఠ ఇంట్లోని రేషన్‌ను దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ నిఖిల్ మాత్రం అలా ఆడేందుకు సిద్ద పడలేదు. కానీ ఇంట్లో రేషన్ విషయంలో దొంగతనాలు జరిగాయి. మరి మున్ముందు ఈ రేషన్ గురించి ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ మాత్రం నిఖిల్, మణికంఠ కడుపు కొట్టినట్టు అనిపిస్తుంది.