ఈ వారం 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు రాకుమారులుగా మారి.. సింహాసనం గెలుచుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ ప్రజలుగా ఉంటారు. ఏ రాకుమారుడికైతే ప్రజల మద్దతు దొరుకుతుందో వారే రాజుగా ఎంపికవుతారు. నిన్నటి నుంచి హౌస్ లో ఈ టాస్క్ జరుగుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో కూడా టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఓ ప్రోమోను విడుదల చేశారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. 


Also Read: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు


'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ 'మట్టిలో మహాయుద్ధం..' అనే గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో రాకుమారులకు(రవి, సన్నీ) సంబంధించిన వ్యక్తులు మట్టిలో మల్లయుద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే సన్నీ టీమ్ లో అమ్మాయిలు లేకపోవడంతో రవి టీమ్ నుంచి ఒక అమ్మాయిని పంపించమని నిన్నటి ఎపిసోడ్ లో అడిగాడు. దానికి రవి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి, అబ్బాయిలతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకున్నారు. 


తాజా ప్రోమో చూస్తుంటే అదే జరిగిందనిపిస్తుంది. 'ఇక్కడ ఏం స్ట్రాటజీ అయిందనేది నాకు క్లారిటీ ఉంది.. అది నేను ఒప్పుకోను.. రండి నేను ఫైట్ చేస్తా' అంటూ రవి టీమ్ పై అరిచాడు సన్నీ. ఆ తరువాత మానస్ మాట్లాడుతూ.. 'ప్రతీసారి మా విషయంలో అన్ ఫెయిర్ డెసిషన్ ఉంటుంది.. ప్రతీసారి మేమే కాంప్రమైజ్ అవుతున్నాం..' అంటూ ఫైర్ అవుతుండగా.. యానీ మాస్టర్ కలుగజేసుకొని.. 'నో కాంప్రమైజ్.. రండి' అంటూ జెస్సీతో మట్టిలో మల్లయుద్ధానికి దిగింది. 




Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత


Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?


Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి