'బిగ్‌ బాస్' సీజన్-5 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ తన ఇంటి సభ్యుల్ని నాలుగు గ్రూప్‌లుగా విడగొట్టారు. సిరి, కాజల్ లను సంచాలకులుగా నియమించారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో ముందుగా సన్నీ.. 'ఇదేందిరా భాయ్.. తొక్కలో ఆట' అంటూ ఫైర్ అయ్యాడు. 'ఎందుకలా అరుస్తారు సంచాలక్ మీద' అంటూ సిరి కోప్పడింది. 


Also Read: ‘అవేంజర్స్’ను మించిన ‘ఇటర్నల్స్’.. థానోస్‌ను ఎందుకు ఆపలేకపోయారు?


'నాకు అందరి ముందు సారీ కావాలి' అని సన్నీను డిమాండ్ చేసింది. దానికి అతడు 'నేను చెప్ప.. ఏం చేసుకుంటావో చేస్కో పో..' అంటూ యాటిట్యూడ్ తో అన్నాడు సన్నీ. ఆ తరువాత కాజల్.. 'మేం పెట్టిన రూల్ ని అధిగమించి కాటన్ లాక్కున్నందుకు గ్రీన్ టీమ్ నుంచి ఒకరు, ఎల్లో టీమ్ నుంచి ఒకరు ముందు నుంచుంటారని' చెప్పింది. దానికి ప్రియా.. 'మేం ఒప్పుకోమని' అంది. దానికి సిరి.. 'ఇది సంచాలక్ గా ఫైనల్ డెసిషన్' అనుకుంటూ వెళ్లిపోయింది. 


'ఈరోజు ఒక రూల్, నిన్నొక రూల్, మొన్నొక రూల్.. రోజుకొక రూల్ పెడతారా..?' అంటూ సన్నీ అగ్రెసివ్ అయ్యాడు. 'నిన్న అందరూ లైన్ క్రాస్ చేసి ఆడినప్పుడు సంచాలక్ లు ఏం పీకుతున్నారని' ప్రశ్నించింది ప్రియా. 'మా ఇష్టమొచ్చినట్లు మేం చేసుకుంటాం' అని కాజల్ అనగా.. 'సరే ఇదే మాట మీద ఉండు' అంటూ ప్రియా చెప్పింది. 'అటు బస్సూ.. ఇటు బస్సూ.. మధ్యలో బస్సులో మనమెళదాం రవణమ్మా' అంటూ మానస్, సన్నీ పాట పడుకున్నారు. 


ఇక సిరి ఎమోషనల్ అవుతుండగా.. షణ్ముఖ్ ఆమెని హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక సన్నీ కెమెరా ముందుకెళ్లి కెప్టెన్ డ్రెస్ వేసుకుంటా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. 'స్పెషల్ పవర్ ఇవ్వాలి నాకు.. అప్పుడు తిప్పుతా గేమ్' అంటూ ప్రియా డైలాగ్ వేసింది.