‘బిగ్‌ బాస్’ సీజన్-5 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ తన ఇంటి సభ్యుల్ని నాలుగు గ్రూప్‌లుగా విడగొట్టారు. ఇందులో మానస్, సన్నీ, ఆనీ, (బ్లూ టీం).. షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ (ఎల్లో టీం).. విశ్వ, శ్రీరామ్, ప్రియ (రెడ్ టీం).. రవి, లోబో, శ్వేతా (గ్రీన్ టీం)గా విడిపోయి బొమ్మలను తయారు చేస్తున్నారు. వీరికి కాజల్, సిరిలు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంటి సభ్యులు తయారు చేసే బొమ్మలు నాణ్యంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడం వీరి పని. మంగళవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో అంతా సవ్యంగానే సాగింది. అయితే, ఈ టాస్క్‌లో రవి, లోబో, శ్వేతాలకు లభించిన స్పెషల్ పవర్ వల్ల.. పెద్ద వార్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 


నిన్నటి వరకు ఆదర్శ తల్లికూతుళ్లుగా మెలిగిన ఆనీ మాస్టార్, శ్వేతాలకు బిగ్ బాస్ పుల్ల పెట్టినట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది. స్పెషల్ పవర్ సాధించిన శ్వేతా టీమ్.. ఆనీ మాస్టర్ టీమ్ తయారు చేసిన బొమ్మలను తీసుకోవడం, ఆనీ ఆ బొమ్మలను తీసుకొనేందుకు తిరిగి ప్రయత్నించడం కనిపించింది. ఈ సందర్భంగా ఆమె శ్వేత నుంచి ఒక బొమ్మ లాక్కొని మానస్‌కు విసరడం కనిపించింది. ఈ సందర్భంగా శ్వేతా-ఆనీ మాస్టర్ మధ్య మాట యుద్ధం జరిగింది. అనంతరం ఆనీ మాస్టర్ ఏడుస్తూ.. ‘‘లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్ పోయాడు, ఈ టాస్క్‌లో బిడ్డ పోయింది. ఈ తొక్కలో రిలేషన్‌షిప్ నాకొద్దు’’ అని శ్రీరామ్, విశ్వతో అనడం ప్రోమోలో కనిపించింది. 


Also Read: ‘అవేంజర్స్’ను మించిన ‘ఇటర్నల్స్’.. థానోస్‌ను ఎందుకు ఆపలేకపోయారు?


శ్వేతపై ఈగ కూడా వాలకుండా కాపాడుకుంటూ వచ్చినా ఆనీ మాస్టరేనా ఈ మాట అన్నదని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. టాస్క్‌లో భాగంగా శ్వేత రివర్స్ కావడాన్ని ఆనీ తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మరి, వీరు ఒకరికొకరు సారీ చెప్పుకుని మళ్లీ కలిసిపోతారా? ఒకరినొకరు నామినేట్ చేసుకుని శత్రువులుగా మారతారా అనేది చూడాలి. లక్కీగా ఆనీ మాస్టర్ ఈ వారం నామినేషన్లో లేరు. లేకపోతే.. ఆమె తప్పకుండా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. వచ్చేవారం నామినేష్లలోకి వస్తే.. ఆమెను నిలవడం కష్టమే అని అభిప్రాయం వెలువడుతోంది. ప్రస్తుతానికి శ్వేతా డేంజర్ జోన్‌లో ఉంది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ఛాన్సులు ఆమెకు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. 


‘బిగ్ బాస్ 5’ ప్రోమో: 



Also Read: సిరి-కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్.. డ్రామా క్వీన్ అంటూ కామెంట్స్..