బిగ్ బాస్ సీజన్ 5 నాల్గోవారం పూర్తి కాబోతుంది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమాదేవి, లహరిలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మరో కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నారు. ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయంలో రేపటి ఎపిసోడ్ లో క్లారిటీ రానుంది. తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాగార్జున లోబోపై ఫైర్ అవుతూ కనిపించారు. 


Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !


ముందు సిరి, షణ్ముఖ్ లను నుంచోమని చెప్పి వారి ముందు మిర్చీలతో ఉన్న ప్లేట్ ను పెట్టారు. 'తినమ్మా చిన్న ముక్క తిను' అని నాగ్.. షణ్ముఖ్ కి చెప్పగా.. అతడు మిర్చీను తిన్నాడు. 5'కూర్చొని కబుర్లు చెప్తున్నావ్ అంతే' అంటూ షణ్ముఖ్ పై పంచ్ వేశారు నాగ్. ఆ తరువాత సిరిని ఉద్దేశిస్తూ.. 'నీ ఆట నువ్ ఆడమ్మా' అని అన్నారు. సిరి-షణ్ముఖ లను ఉద్దేశిస్తూ.. మీ కారణంగా జెస్సీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు అన్నారు నాగ్. 
వెంటనే జెస్సీ 'కెప్టెన్ గా నేను ఫెయిల్ అయ్యాను సర్' అనగా.. 'కానీ తప్పు చేసిన వాళ్లు ఒప్పుకోవడం లేదు' అన్నారు నాగ్.


ఆ తరువాత లోబో.. 'నా వరకు నేనేంచేసినా.. బరాబర్ చేసినా.. జనాలకు నచ్చుతుందో లేదో తెలియడం లేదు' అన్నాడు. 'అంటే అరవడం కూడా అలానే అరుస్తావా' అని నాగ్ ప్రశ్నించాడు. దానికి లోబో.. 'లవ్ అనే పదం అనగానే' అంటూ ఏదో చెప్పబోతుంటే.. 'నీ ఒక్కడికే ఉంది ప్రేమ ఇంకెవరికీ లేదు' అని కామెంట్ చేశారు నాగ్. 'మాట్లాడితే బస్తీ నుంచి వచ్చాను.. this is bigg boss house.. ఇది బస్తీ కాదు, విల్లా కాదు.. అందరూ ఒక్కటే' అంటూ ఫైర్ అయ్యారు నాగ్. 






Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు


Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి