మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసిఫర్ సినిమా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ ఒక మలయాళ సినిమా. ఇక పవన్ కళ్యాణ్ కూడా మళయాళంలో సూపర్ హిట్ కొట్టిన ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమాను భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ సినిమా సెట్‌ను  భీమ్లానాయక్ టీమ్ సందర్శించింది. వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇద్దరు మెగా బ్రదర్స్ సెట్ లో ఒకేచోట కనిపించేసరికి అందరి ఫోన్లు క్లిక్ మన్నాయి. మెగా హీరోలను సింగిల్ గా చూస్తేనే ఆనందపడే మెగా ఫ్యాన్స్ కు అన్నదమ్ములిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. చిరు ఖైదీ డ్రెస్ లో ఉండగా, పవన్ పోలీస్ డ్రెస్ లో ఉన్నారు.ఫోటోల్లో వారిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది.  వీరిద్దరి వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 


పవన్ కళ్యాణ్ తో పాటూ రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర కూడా చిరును సెట్లో కలిశారు. చిరుకు కలిసొచ్చిన ఖైదీ నెంబర్ 786 నెంబర్ నే గాడ్ ఫాదర్లో కూడా ఉపయోగించారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఇతను తమిళంలో హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమా దర్శకుడు. తని ఒరువన్ ను తెలుగులో ధ్రువగా రీమేక్ చేశారు.గాడ్ ఫాదర్ సినిమాను రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 


భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న శుక్రవారం విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు చేశారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. విడుదలైన రెండు ట్రైలర్లు ఇరగ దీశాయి. ఇప్పటికే భీమ్లానాయక్ పాటలు సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.  





Also read: వారానికోసారి బోన్ సూప్, తాగితే అందం ఆరోగ్యం కూడా, ఇదిగో సింపుల్ రెసిపీ


Also read:  మీరు తినే ఆహారంలో ప్లాస్టిక్ కలుస్తోంది గమనించారా? ఎలా అంటే ఇదిగో ఇలా