నటుడు 'బబ్లూ' పృథ్వీరాజ్ ఓ యువతిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న పృథ్వీ 23 ఏళ్ల మలేషియా అమ్మాయితో ప్రేమలో పడ్డాడని కథనాలను ప్రచురించారు. తాజాగా ఈ వార్తలపై పృథ్వీ స్పందించారు. ఆమెకి 23 ఏళ్లు కాదని.. 24 ఏళ్లని చెప్పారు. అలానే ఆమె మలేషియాకి చెందిన అమ్మాయి కాదని.. తెలుగమ్మాయని చెప్పారు. 


ప్రేమ ఏ వయసులో పుడుతుందో చెప్పలేమని.. ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదని అన్నారు. కర్ణాటకకు చెందిన పృథ్వీరాజ్ తెలుగులో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. 'పెళ్లి' సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత దాదాపు నలభై తెలుగు సినిమాల్లో నటించారాయన. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశారు. 


1994లో బీనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పృథ్వీరాజ్. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతడు వయసు 27 ఏళ్లు. అయితే కొన్నేళ్లుగా భార్యతో గొడవలు జరుగుతుండడంతో ఆమెకి దూరంగా ఉంటున్నారు పృథ్వీరాజ్. తన కొడుకుని మాత్రం నెలకు ఒకసారి కలుస్తానని చెప్పారు. భార్యకు దూరంగా ఉంటున్న పృథ్వీ.. 24 ఏళ్ల తెలుగమ్మాయి శీతల్ తో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం శీతల్ తో సహజీవనం చేస్తున్నట్లు పృథ్వీ తమిళ మీడియాకు వెల్లడించారు. 


56 ఏళ్ల పృథ్వీ 24 ఏళ్ల అమ్మాయితో సహజీవనం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే శీతల్ తనను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పారాయన. మొదట శీతల్ తో పెళ్లికి తను ఒప్పుకోలేదని.. బాగా ఆలోచించుకోమని చెప్పానని పృథ్వీ అన్నారు. కానీ ఆమె మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని చెప్పిందని.. ఆమె ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. 


మొదటి భార్య బీనాకు రెండు నెలల క్రితం విడాకులు ఇచ్చానని చెప్పిన పృథ్వీ.. త్వరలోనే శీతల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. శీతల్ దృష్టిలో వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని.. ఆమె తనను బాగా చూసుకుంటుందన్న నమ్మకం ఉందని పృథ్వీ అన్నారు. శీతల్ తో ఒక బిడ్డను కూడా కనాలని ఉందని వెల్లడించారు పృథ్వీ. 


Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా