Anand Deverakonda: ఇటీవల విడుదలైన తెలుగు సినిమాల్లో ‘బేబీ’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీను సాయి రాజేష్ తెరకెక్కించారు. ఇందులో ఆనంద్ దేవకరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. మూవీ పెద్ద హిట్ అవ్వడంతో మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ‘బేబీ’ మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ వేదికపై మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆనంద్ వ్యాఖ్యలు నెెట్టింట వైరల్ అవుతున్నాయి. 


చిరంజీవి సినిమాలు వచ్చినపుడు ఇంట్లో పేచీ పెట్టేవాణ్ణి: ఆనంద్ దేవరకొండ


‘బేబీ’ సినిమా సక్సెస్ మీట్ లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పలు విషయాలను చెప్పుకొచ్చాడు ఆనంద్. తాము చిన్నప్పుడు హాస్టల్ లో ఉన్నప్పుడు పెద్దగా సినిమాలు చూసేవాళ్లం కాదని, ఎప్పుడో సమ్మర్ హాలిడేస్ కు ఇంటికొచ్చినపుడు థియేటర్లకు తీసుకెళ్లమని గోల చేసేవాళ్లమని చెప్పాడు. ముఖ్యంగా చిరంజీవి సినిమా రిలీజ్ అయినపుడు మాత్రం థియేటర్ కు తీసుకెళ్ళాలని పేచీ పెట్టి మరీ చిరంజీవి సినిమాలు చూసేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు ఆనంద్.


మెగాస్టార్ ను చూసి అలా ఫీల్ అయ్యేవాడిని..


మెగాస్టార్ ను సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే ఒక ఎనర్జీ వస్తుందని అన్నాడు ఆనంద్ దేవరకొండ. చిరంజీవి డాన్స్ చేసినా ఫైట్స్ చేసినా డైలాగ్స్ చెప్పినా ఒక యాస్పిరేషనల్ క్వాలిటీ కనిపిస్తుందని అది చూసి తానున ‘ఇది కదా లైఫ్ నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఇలా చిరంజీవిలా ఉండాలి’ అని అనుకునేవాడినని, అంతలా ఆయన సినిమాలు తనను ప్రభావితం చేశాయని అన్నాడు. అలాంటి మెగాస్టార్ ఇప్పుడు తన సినిమాను అభినందించడానికి తమ మధ్యలోకి రావడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. 


సాయి రాజేష్ పెద్ద దర్శకుడు అవుతాడు..


‘బేబీ’ సినిమా ఇంత బాగా రావడానికి ఒక కారణం నిర్మాత ఎస్కేఎన్ అయితే మరో కారణం దర్శకుడు సాయి రాజేష్. సాధారణంగా ఏదైనా సినిమా తీస్తే ఆ సినిమా హీరోకే ఎక్కువ పేరు వస్తుంది. ఎప్పుడో గానీ దర్శకుడికి పేరు రాదు. ఇప్పుడు ‘బేబీ’ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ కు ఆ పేరు వచ్చిందని, సినిమాల మీద ఫ్యాషన్ ఉన్నవాళ్లను ఒక చోటకు చేర్చి ఇలాంటి అద్భుతాన్ని తెరకెక్కించాడని అన్నాడు. ఈ మూవీతో సాయి రాజేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడని అన్నాడు. అలాగే తాము ఎన్ని సక్సెస్ మీట్ లు పెట్టినా ఏం చేసినా ఇంత సక్సెస్ అవుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం ప్రేక్షకులని వ్యాఖ్యానించాడు. తమ సినిమాను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు ఆనంద్. 


Also Read: బాలీవుడ్ తండ్రీ కొడుకులతో అక్రమ సంబంధం - ఆ సినీ క్రిటిక్‌పై మహిళా కమిషన్‌కు సెలీనా ఫిర్యాదు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial