'మేజర్'.. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. 


వేసవి కానుకగా మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈరోజు ముంబై చిన్న ఈవెంట్ ను ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 9న 'మేజర్' ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ సినిమాను మూడు భాషల్లో చిత్రీకరించినట్లు నటి శోభితా దూళిపాళ్ల వెల్లడిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. 


ఇందులో నటీనటులు ఒకే సీన్ ను వేర్వేరు భాషల్లో డైలాగ్స్ చెబుతూ నటిస్తూ కనిపించారు. ఈ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేపధ్య సంగీతం ఓ రేంజ్ లో ఉంది. 'మేజర్' సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ప్రై.లితో కలిసి సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 


ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.


Also Read: 'ఎఫ్3' ట్రైలర్ డబ్బింగ్ పూర్తి చేసిన వెంకీ - ఫ్యాన్స్ రెడీనా?


Also Read: మహేష్ బాబుని మూడు సార్లు కొట్టిన కీర్తి సురేష్ - మరీ అంత కోపమా?