టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ సినిమా'ఆదిపురుష్​'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్​, ట్రైలర్ అభిమానులను ఓ రేంజిలో అలరించాయి. సినిమా​తో భారీగా అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘జై శ్రీ రామ్​’ ఫుల్ సాంగ్ విడుదలైంది.  మహిమాన్విత మంత్రం నీ నామం అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది.


యూట్యూబ్ లో 'జై శ్రీ రామ్' సాంగ్ సరికొత్త రికార్డు


సినిమాలో ఈ పాట హైలెట్ గా ఉండబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు, తాజాగా విడుదలైన ఈ పాట అద్భుతంగా ఉందంటున్నారు సినీ అభిమానులు. లిరిక్స్​, మ్యూజిక్​, విజువల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి.  ఇక ఈ పాట యూట్యూబ్‌లో గత 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా రికార్డు సాధించింది. తాజా వివరాల ప్రకారం  ‘ఆది పురుష్‌’ సాంగ్ 31,607,790కి పైగా వ్యూస్ అందుకుంది. 5 లక్షల 67 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.  ప్రముఖ సంగీత దర్శకులు  అజయ్, అతుల్​ ఈ పాటకు స్వరాలు అందించారు. ఈ పాటకు హిందీలో మనోజ్ ముంతాషీర్‌, తెలుగులో  రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. “ఎవరు ఎదురు రాగలరు మీ దారికి? ఎవరికుందీ ఆ అధికారం? పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హూంకారానికి” అంటూ ప్రభాస్ వాయిస్ తో మొదలయ్యే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి.    



సంతోషం వ్యక్తం చేసిన సంగీత దర్శకుడు  


అటు ఈ పాటకు వస్తున్న ఆదరణ పట్ల సంగీత దర్శకుడు అజయ్  సంతోషం వ్యక్తం చేశారు. “ఇది మేము ఈ సినిమాకు  కంపోజ్ చేసిన తొలి పాట. శ్రీరాముడి పేరు వినగానే ఆ శక్తి, భక్తి ఆటోమేటిక్‌గా ఈ పాటలోకి వచ్చేశాయి. పాట కంపోజ్ చేస్తున్నప్పుడు అద్భుత శక్తి తమను వెనుకుండి నడిపిస్తున్నట్లుగా అనిపించింది. పాటకు లభిస్తున్న ఆదరణ, ప్రేమ పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.  గీత రచయిత మనోజ్ ముంతాషీర్‌  పాటను చాలా బాగా రాశారు. ఈ పాటను 30 టీమ్ కలిసి పాడారు” అని చెప్పుకొచ్చారు.   


రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’


ఇక ఈ సినిమా రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఆయన సతీమణి సీతాదేవిగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా ​ సన్నీ సింగ్​, హనుమంతుడిగా దేవదత్త్​ నాగే, రావణాసురుడిగా సైఫ్​ అలీ ఖాన్​ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాను రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 16న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్​ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం పోస్టర్లు, పాటలు విడుదల చేస్తున్నారు.    


Read Also: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడం కుట్ర - మహానాయకుడు గురించి టాలీవుడ్ సెలబ్రిటీస్ ఏమన్నారంటే?