‘ఆదిపురుష్’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ దృశ్యకావ్యం సినిమాను జూన్ 16 న విడుదుల చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయిపోయాయి. తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. తెలంగాణలో ‘ఆదిపురుష్’ సినిమాను శుక్రవారం (జూన్ 16) తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక స్పెషల్ మార్నింగ్ షో ను ప్రదర్శించడానికి నైజాం డిస్ట్రీబ్యూటర్ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అనుమతినిచ్చింది. ఈ మేరకు స్పెషల్ షో కు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ స్పెషల్ షో వేసుకోవడానికి థియేటర్ అద్దె, ఇతర సంబంధిత పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది. దీని కోసం సురేష్ వర్మ అనే వ్యక్తిని సంప్రదించాలని అతని ఫోన్ నంబర్ ను ప్రకటనలో పొందుపరిచింది. దీంతో నైజాం ప్రాంతంలో ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


ఏపీలో బెనిఫిట్ షోలకు నిరాకరణ..


ఏపీలో ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరపై రూ.50 పెంచుకోవచ్చన ఓ జీవోను విడుదల చేసింది. అయితే ఇది కేవలం పది రోజుల వరకే అనుమతి ఉంటుందని జీవోలో పేర్కొంది. అలాగే రోజుకు 5 షోలు మాత్రమే ప్రదర్శించాలని చెప్పింది. బెనిఫిట్/స్పెషల్ షోలకు సంబంధించి జీవోలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది ఏపీ ప్రభుత్వం. అయితే అక్కడ సింగిల్ థియేటర్లలో రోజుకు ఐదు షో లు మాత్రమే ప్రదర్శితమవుతాయని తెలుస్తోంది. ఇక తెలంగాణలోనూ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. కాకపోతే రేపు ఒక్క రోజు మాత్రం తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక స్పెషల్ షో కు అనుమతి ఉంది. దీని బట్టి తెలంగాణలో ఉదయం 6:30 గంటలకే షో పూర్తయి సినిమా టాక్ కూడా బయటకు వచ్చేస్తుందన్నమాట. 


మొదటిరోజు వంద కోట్ల వసూళ్లు?


‘ఆదిపురుష్’ పురుష్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మూవీ ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. సినిమా అనౌన్స్ నుంచి మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకూ ఏదొక వివాదం జరుగుతూనే ఉంది. అయితే మొన్న రిలీజ్ చేసిన ఫైనల్ ట్రైలర్ తర్వాత ఈ సినిమా నెగిటివ్ టాక్ కాస్తా పాజిటివ్ టాక్ గా మారిపోయింది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో అడ్వాన్స్ బుగింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటిగా ‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ‘ఆదిపురుష్’ సినిమాకు మొదటి రోజే రూ.100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్ళు వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. నిజంగా ఇలా జరిగితే ఇది పెద్ద రికార్డ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: కూతురు వయస్సుతో అమ్మాయితో లిప్ లాకా? ఆ నటుడిపై నెటిజన్ల విమర్శలు