Adipurush: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారీ ప్రాజెక్ట్ సినిమాలలో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ లు నటించారు. ఈ సినిమాకు దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన పస్ట్ లుక్ టీజర్ లు మూవీ పై అంచనాలు పెంచేశాయి. అందులోనూ రామాయణ గాథ ఆధారంగా వస్తోన్న సినిమా కాబట్టి ప్రేక్షకల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ను ప్రకటించారు మూవీ మేకర్స్. తిరుపతిలో ఈ నెల 6 న వైభంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. 


భారీ సెట్టింగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..


‘ఆదిపురుష్’ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు మూవీటీమ్. సినిమాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు చినజీయార్ స్వామీజీ హాజరై ఆశీస్సులు అందజేయనున్నారు. అలాగే ఈ వేడుకలో 50 అడుగుల ప్రభాస్ హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఆదిపురుష్ , రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ఈవెంట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేసే అయోధ్య యొక్క భారీ సెట్‌ను ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు లక్షకు పైగానే ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్ లో భాగం కానున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 


‘బాహుబలి’ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?


‘ఆదిపురుష్’ సినిమాను భారీ అంచనాల మధ్య తెరకెక్కించారు మేకర్స్. మూవీ టీమ్ అంతా ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. తిరుపతిలో ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయడం పట్ల ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి ది బిగినింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా తిరుపతిలోనే పెట్టారు. ఆ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. అలాగే ఇప్పుడు ఈ ‘ఆదిపురుష్’ ఈవెంట్ కూడా ఇక్కడే పెట్టడంతో రెబల్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైష్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి జూన్ 16 న విడుదల సినిమా కానుంది.


Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!