ప్రముఖ నటి పాయల్ ఘోష్, మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఈసారి తను ఏకంగా బాలీవుడ్ ను టార్గెట్ చేశారు. బాలీవుడ్ స్వభావం, దాన్ని ఏలుతున్న వారి నిజ స్వరూపాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. బాలీవుడ్ లో ఉన్న కొంత మంది ఇతరులను చంపి, వారి రక్తాన్ని మరొకరికి తినిపిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంటీక్రిస్ట్ సమయంలో నాయకులు ప్రజలను చంపుతారు. అలాగే, బాలీవుడ్‌లోని కొందరు వ్యక్తులు సైతం అదే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వ్యక్తులు మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే తనకు నవ్వుతో పాటు కోపం వస్తుందన్నారు.


బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాయల్ ఘోష్


“నేను కొన్నిసార్లు చాలా కోపంగా ఉంటాను. నా కోపాన్ని కూడా బయటకు  వ్యక్తపరుస్తాను. కానీ, నేను మీతో చెప్తున్నాను. బాలీవుడ్ ను ఏలుతున్న వారిలో కనీసం 50-60% మంది అవినీతిలో ఉన్నారు” అంటూ హాట్ కామెంట్స్ చేశారు.  ప్రియాంక చోప్రా ఇటీవలి 'బాలీవుడ్‌లో కార్నర్డ్' వ్యాఖ్యపైనా తను స్పందించారు. "బాలీవుడ్  అసలు స్వభావం ప్రతి ఒక్కరికి తెలుసు.  ప్రతి ఒక్కరు రంధ్రాన్వేషణ చేసేవాళ్లే. అలా అంటున్నందుకు క్షమించండి” అన్నారు.


బాలీవుడ్ దర్శకుడిపై సంచలన ఆరోపణలు


తెలుగులో  పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాయల్, #MeToo ఉద్యమంలో పాల్గొన్నారు.  బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ సంచనల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. సినిమాలో అవకాశం కోసం కలిసినప్పుడు అతడు తనపై లైంగిక దాడి చేశాడని వెల్లడించారు. ఇలాంటి వాళ్లు ఇంకా బాలీవుడ్ లో ఉండటం బాధాకరమని తెలిపారు. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ సూసైడ్ నోట్ ఫోటోను షేర్ చేసి అందర్నీ షాక్ కు గురిచేసింది.  ‘‘నేను పాయల్ ఘోష్ ను, ఒక వేళ నేను సూసైడ్ చేసుకున్నా లేదా హార్ట్ ఎటాక్ తో చనిపోయినా దానికి కారణం ఎవరంటే?’’ అంటూ రాసి మిగతా ఖాళీను ఏమీ రాయకుండా వదిలేసింది. ఈ పోస్ట్ చూసి అందరూ షాక్ కు గురయ్యారు. 


ప్రస్తుతం  కృష్ణ అభిషేక్‌తో కలిసి పాయల్ 'రెడ్' సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో తను  ఎస్కార్ట్ పాత్రలో కనిపించనుంది. అంతేకాదు, ఈ చిత్రంలో శక్తి కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అశోక్ త్యాగి ఈ ఇంటెన్స్ అండ్ స్లిక్ థ్రిల్లర్‌ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ ఒక కాలేజీ అమ్మాయి గృహిణిగా మారి ఆ తర్వాత ఎస్కార్ట్‌ గా మారడం చుట్టూ తిరుగుతుంది.  


తెలుగులో పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్


పాయల్ ఘోష్ కలకత్తాకు చెందిన నటి. మంచు మనోజ్ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టింది పాయల్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘మిస్టర్ రాస్కెల్’ సినిమాలో  నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.






Read Also: డిస్నీలో ఓ కల - 'దిల్' రాజు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల