గోపీచంద్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేశాడు. గోపీచంద్​ బ్లాక్​ బస్టర్ హిట్​ కొట్టారని చెప్పాడు.


గోపీచంద్, తమన్నా ప్రధానపాత్రల్లో సంపత్ నంది చిత్రాన్ని తెరకెక్కించారు.  వినాయక చవితి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్​తో  తెచ్చుకుంటోంది.  ఈ సందర్భంగా మూవీ సక్సెస్​పై స్పందించారు రెబల్​స్టార్ ప్రభాస్. బ్లాక్​బస్టర్​ కొట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.


సీటీమార్ తో నా మిత్రుడు బ్లాక్​బస్టర్ హిట్​ కొట్టాడు. చాలా సంతోషంగా ఉంది. కొవిడ్​ రెండో వేవ్​ తర్వాత థియేటర్​ వేదికగా పెద్ద సినిమాను విడుదల చేసే ధైర్యం చేసిన చిత్ర యూనిట్​ను మెచ్చుకోవాలి.. అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు.


 



కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపీచంద్.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా కనిపిస్తారు. 'సీటీమార్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సిన కొన్నికార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అన్ని అడ్డంకులు దాటుకొని గ‌త నెల‌లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమాకు క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది. అయితే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారని జోరుగా టాక్ నడిచింది. చివరకు థియేటర్లలోనే సినిమాను విడుదల చేశారు.


Also Read: Seetimaarr Movie Review : సీటీమార్ మూవీ రివ్యూ.. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్..


Also Read: Bigg Boss 5 Telugu : ఈ వారం వారిద్దరూ సేఫ్.. కాజల్ నటిస్తూనే ఉందన్న ఉమాదేవి.. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన షణ్ముఖ్..