పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. 


మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలానే మార్పులు చేశారు. హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాముఖ్యతనిచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా రానా కనిపించారు. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 


ఇప్పటికే హరీష్ శంకర్ 'భీమ్లానాయక్' సినిమాపై పాజిటివ్ ట్వీట్ వేయగా.. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఈ సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న పోస్టర్ ని షేర్ చేస్తూ.. 'ఒకే ఫ్రేమ్ లో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు. ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవాలి. త్రివిక్రమ్ గారి రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కుదోస్ టు సితార ఎంటర్టైన్మెంట్స్' అంటూ రాసుకొచ్చారు.