Hyderabad News: తెలంగాణ ఎన్నికలకు సమయం రానే వచ్చింది. నవంబరు 30న రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ జరగనుంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకూ, సినీ ప్రముఖుల వరకూ అందరూ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయాల్సిందే. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలు ఓటు వేయడం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. తమ అభిమాన నటుడు లేదా నటి పోలింగ్ బూత్ కు వచ్చి, లైన్ లో నిలబడి ఓటు వేస్తుంటే సామాన్యులకు ఆసక్తికరంగా ఉంటుంది. జూబ్లీహిల్స్, మణికొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉండే సెలబ్రిటీలు రేపు (నవంబర్ 30) ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తున్నారనే విషయాలు బయటికి వచ్చాయి.


జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ 
(పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ 
ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ 
పోలింగ్‌ బూత్‌ (160):  విశ్వక్‌సేన్‌ 
పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు
జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌ 
ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ (పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ 
ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి
బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ 
వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ (పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌
మణికొండ: హైస్కూల్ ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం 
షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: రాజమౌళి రామారాజమౌళి 
రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌
యూసఫ్‌ గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి