తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ రెడీ అవుతున్నాయ్. ఏ యే నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించేసింది. టికెట్ దక్కని నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు...బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ సీనియర్ నేతలను.... రంగంలోకి దించింది. టికెట్ దక్కని నేతలకు...నామినేటేడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తామని హామీలు ఇస్తోంది. పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచిస్తోంది. కొందరు నేతలు బుజ్జగింపులతో మెత్తబడినా...మరికొందరు అలకవీడటం లేదు. 


టికెట్ దక్కిన బీఆర్‌ఎస్‌ నేతలు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారని ఆరా తీస్తున్నారు. వారి సామాజిక వర్గాలు ఏంటి ?ఎన్ని కోట్లు ఖర్చు చేయగలరు ? బలహీనతలు, బలాలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి వివరాలు తెప్పించుకుంటున్నారు.  సన్నిహితులు, పార్టీ నేతల ద్వారా...ప్రత్యర్థుల బ్యాక్ గ్రౌండ్ కనుక్కుంటున్నారు. వారి సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయ్. ఏ యే గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయ్ ? అన్న అంశాలపై దృష్టి సారించారు. 


కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పార్టీ తరపున పోటీ చేసే వారిని ప్రకటించకపోయినా...బీఆర్‌ఎస్‌ మాత్రం ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.  కీడెంచి...మేలు ఎంచాలన్న టార్గెట్ తో పని చేస్తున్నారు. గులాబీ బాస్ ఎన్నో ఆశలతో టికెట్ కేటాయించారని...గెలిచి తీరాలన్న వ్యూహాలతో నేతలు ప్రచారం షూరూ చేసేశారు. కాంగ్రెస్ క్యాండేట్ ను ఎలా ఇరుకున పెట్టాలి. బీజేపీని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్న అంశాలతో ఎజెండాను రెడీ చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలోకి రాకముందే...ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలు పెట్టేశారు. గ్రామాల వారీగా పార్టీ నేతలను పిలిపించుకొని...ప్రత్యర్థి ఓట్ల శాతాన్ని తెలుసుకుంటున్నారు. 


ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే..ఏం చేయాలి. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు  వచ్చిన ఓట్లు ఎన్ని వంటి వివరాలను బీఆర్‌ఎస్‌  అభ్యర్తులు సేకరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఫిక్సయిన తర్వాత...దూకుడుగా వ్యవహరించాలని బీఆర్‌ఎస్‌ నేతలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఓటర్లకు ఇప్పటి నుంచే తాయిలాలు ప్రకటించేస్తున్నారు. కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉన్న గ్రామాలపై నేతలు కాన్సట్రేట్ చేశారు. ప్రత్యర్థి పార్టీల సెకండ్ క్యాడర్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఏం కావాలో అన్ని చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. నగదుతో పాటు కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. ఫ్యూచర్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.


ఇప్పుడు ఏ నియోజకవర్గం చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు ముఖ్యంగా టికెట్ దాదాపు ఖరారు అయినవాళ్లు కేడర్‌ను కాపాడుకుంటూ ప్రజల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బలహీనతలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఐదు పదేళ్లలో వాళ్లు చేసిన తప్పులు చిట్టాలపై ఆరా తీస్తున్నారు. అధికార పాార్టీ చేపట్టే వ్యూహానికి విరుగుడు ప్లాన్‌తో ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయ. అయితే టికెట్ కేటాయించిన తర్వాత ఎంత మంది రెబల్స్ అవుతారో అన్న గుబులు కూడా ప్రతిపక్షాల్లో ఉంది.