Punjab Election 2022: 'కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను సీఎం పదవి నుంచి అందుకే తప్పించాం'

ABP Desam Updated at: 17 Feb 2022 07:56 PM (IST)
Edited By: Murali Krishna

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భాజపాపై విమర్శలు కురిపించారు. అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించడంపై తొలిసారి స్పందించారు.

రాహుల్ గాంధీ

NEXT PREV

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తొలిసారి స్పందించింది. పంజాబ్ ఫతేఘర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడారు. 







పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కెప్టెన్ అమరీందర్ సింగ్‌ నిరాకరించారు. విద్యుత్ పంపిణీ సంస్థలతో తనకు ఒప్పందాలున్నాయని అందుకే ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి అంగీకరించనని అమరీందర్ అన్నారు. అందుకే ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది.                                          - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత


నవజోత్ సింగ్ సిద్ధూతో నెలకొన్న విభేదాల కారణంగా అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి గత సంవత్సరం రాజీనామా చేశారు. అనంతరం చరణ్‌జిత్ సింగ్ చన్నీనని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. అనంతరం అమరీందర్ సింగ్ సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో భాజపాతో కలిసి ఆయన పోటీ చేస్తున్నారు.



ప్రధానిపై


ప్రధాని నరేంద్ర మోదీపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోదీలా తాను అసత్యాలు చెప్పలేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.



ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి నేను ఇక్కడకి రాలేదు. 2 కోట్ల ఉద్యోగాలిస్తానని, రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాలో వేస్తాననే అసత్య హామీలు నేను ఇవ్వను. పంజాబ్‌లో శాంతి, సోదరభావాలు చాలా ఎక్కువ. ఇక్కడ మనం ఓడిపోతే వాటితో పాటు అన్నీ కోల్పోయినట్లే. అందుకే మన అధికారాన్ని మనం కాపాడుకోవాలి. వీటిని కాంగ్రెస్ మాత్రమే కాపాడగలదు.                                               - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత



Published at: 17 Feb 2022 07:55 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.