Pm Modi Election Campaign In Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ నెలకొంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలను ప్రచారం ముమ్మరం చేశాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరోసారి తెలంగాణకు (Telangana) రానున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 8, 10 తేదీల్లో ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరు కానున్నారు. 10న మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలోనూ ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


ఏపీలోనూ ప్రచారం


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అటు ఏపీలోనూ ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 3, 4 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. 3వ తేదీన పీలేరు, విజయవాడలో మోదీ పర్యటన ఉంటుంది. పీలేరు మధ్యాహ్నం 2:45 గంటలకు, అలాగే విజయవాడలో సాయంత్రం 6:30 గంటలకు రోడ్ షో నిర్వహిస్తారు. ఇక 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Also Read: KCR News: కేసీఆర్‌కు షాక్! ఎన్నికల సంఘం బ్యాన్ - అప్పటిదాకా ప్రచారానికి దూరమే