UPSC Prelims 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2026 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మరింత పారదర్శకంగా చేయడానికి కొత్త సాంకేతికతను ఉపయోగించింది. దరఖాస్తులను పరిశీలించడానికి కమిషన్ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించింది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని 569 దరఖాస్తులను గుర్తించింది. పరీక్ష ప్రారంభం కావడానికి ముందే రూల్స్‌ బ్రేక్ చేసిన వారి ఫారాలన్నింటినీ తిరస్కరించింది. 

Continues below advertisement

15 ఏళ్ల రికార్డుల సహాయంతో దర్యాప్తు జరిగింది

దరఖాస్తులను ధృవీకరించడానికి గత 15 సంవత్సరాల రికార్డులు, డేటాను ఉపయోగించినట్లు యూపీఎస్సీ తెలిపింది. ఏఐ (AI) సహాయంతో, ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించడం, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తును నింపడం వంటి కేసులను గుర్తించారు. ధృవీకరణ పూర్తైన తర్వాత, అటువంటి దరఖాస్తులన్నింటినీ రద్దు చేశారు.

తొలిసారిగా ఫేస్‌ ఐడెంటిఫికేషన్

ఈ సంవత్సరం, యూపీఎస్సీ పరీక్షా విధానంలో మరో ప్రధాన మార్పు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి సుమారు 30 నిమిషాల ముందు, అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ఫేస్‌ ఐడెంటిఫికేషన్ చేశారు. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్ నుంచి లైవ్‌లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేయడాన్ని కూడా తప్పనిసరి చేశారు, తద్వారా వేరొకరు పరీక్ష రాసే అవకాశం లేకుండా చేశారు. 

Continues below advertisement

Also Read: సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి కలిగి ఉన్న పిడుగు వెనుక ఉన్న రహస్యాలివే!

ఆధార్ నంబర్ ద్వారా గుర్తింపు 

అభ్యర్థులకు స్వచ్ఛందంగా తమ ఆధార్ నంబర్‌ను అందించే అవకాశాన్ని కూడా కమిషన్ కల్పించింది. దాదాపు 94 శాతం మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ ఆధార్ నంబర్‌ను అందించారు. దీనివల్ల గుర్తింపు ధృవీకరణ సులభమైంది. దరఖాస్తు ధృవీకరణ సరళీకృతమైంది.

కేటగిరి మార్చిన వారికి సమాచారం 

కేటగిరీని ఎందుకు మార్చుకున్నారో వివరించాలని చెబుతూ, యూపీఎస్సీ సుమారు 43,497 మంది అభ్యర్థులకు ఇమెయిల్స్ పంపింది. కేటగిరీని మార్చడం వల్ల అభ్యర్థి అటెంప్ట్స్‌ సంఖ్యపై ప్రభావం పడొచ్చని కమిషన్ వివరించింది. అందువల్ల, తమ కేటగిరీని మార్చుకున్న అభ్యర్థులను అందుకు స్పష్టమైన కారణం చెప్పమని కోరింది. 

Also Read: చీకటిలో మనుషులు కూడా మెరుస్తారు! ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

అవకతవకలు ఇప్పటికే గుర్తింపు

గతంలో, ఇంటర్వ్యూలు లేదా పత్రాల ధృవీకరణ సమయంలో అనేక ఉల్లంఘనలు గుర్తించేవారు. అయితే, ఏఐ, డిజిటల్ ధృవీకరణ సహాయంతో, ఇప్పుడు అటువంటి అవకతవకలు పరీక్షకు ముందే గుర్తిస్తున్నారు. దీనివల్ల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా, విశ్వసనీయంగా మారుతుందని ఆశిస్తున్నారు.

ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు?

UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 కోసం దాదాపు 8.18 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో, దాదాపు 4.49 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. AI-ఆధారిత ధృవీకరణ, కొత్త భద్రతా వ్యవస్థల ద్వారా, పరీక్షా ప్రక్రియను మరింత నిష్పక్షపాతంగా, సురక్షితంగా మార్చే దిశగా కమిషన్ ఒక కీలకమైన అడుగు వేసింది.

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
2యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే
3జంతువులకు నెలసరి వస్తుందా? ఇది మనుషులకే పరిమితమైందా?
4బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?
5చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?