TS EdCET Result-2023: తెలంగాణలో బీఈడీ (BEd) ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు (TS Ed-CET result) జూన్ 12న విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఆధ్వర్యంలో మే 18న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి(TSCHE) ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి సోమవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించినట్టు లింబాద్రి వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జి.వినీషకు తొలి ర్యాంకు సాధించగా హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకు సాధించారు.


ఎడ్‌సెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


టాప్ టెన్ ర్యాంక‌ర్లు వీరే..


1. గొల్ల వినీష‌(తాండూరు, వికారాబాద్)


2. నిషా కుమారి(బేగంపేట్, హైద‌రాబాద్)


3. ఎం సుశీ(బ‌ర్క‌త్‌పుర‌, హైద‌రాబాద్‌)


4. వాసాల చంద్ర‌శేఖ‌ర్(మెట్‌ప‌ల్లి, జ‌గిత్యాల‌)


5. అకోజు త‌రుణ్ చంద్‌(శ్రీరాంపూర్‌, పెద్ద‌ప‌ల్లి)


6. తోన్‌పూల ప్ర‌శాంత్(ఆదిలాబాద్ రూర‌ల్)


7. మ‌హ్మ‌ద్ ష‌రీఫ్ సీ(శేరిలింగంప‌ల్లి, రంగారెడ్డి)


8. కుసుమ విన‌య్‌కుమార్(కోన‌సీమ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)


9. మోట‌పోతుల అరుణ్ కుమార్(అబ్బాపూర్, ములుగు)


10. ఏ ల‌క్ష్మీ గాయ‌త్రీ(ఎస్ఆర్ న‌గ‌ర్, హైద‌రాబాద్)


Also Read:


సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2023 ఫలితాలు జూన్ 12న  విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్‌లో మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పొందుపరిచారు. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో మొత్తం 14,624 మంది అభ్యర్థులు అర్హ‌త సాధించారు. మొత్తం 1105 పోస్టులకుగానూ సెప్టెంబ‌రు 15 నుంచి మెయిన్స్ ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ - 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీని సివిల్స్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 28న నిర్వహించిన సంగతి తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..