తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండ‌గా, మొదటి దశలో 70,665 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలి ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక ఈ ఏడాది కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్ల‌న్నీ నిండిపోయాయి. ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు పెద్ద ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.20 శాతం సీట్లు భ‌ర్తీ కాగా, ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, ఇత‌ర ఇంజినీరింగ్ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి.


కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల‌ను ప‌రిశీలిస్తే..
ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, కంప్యూట‌ర్ ఇంజినీరింగ్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం, సీఎస్ఈ(ఐవోటీ అండ్ సైబ‌ర్ సెక్యూరిటీ ఇన్‌క్లూడింగ్, బ్లాక్ చైన్ టెక్నాల‌జీ)లో, కంప్యూట‌ర్ సైన్స్, ఇంజినీరింగ్ నెట్‌వ‌ర్క్స్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో 100 శాతం సీట్లు నిండిపోయాయి. కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌(సీఎస్ఈ)లో 98.70 శాతం సీట్లు నిండిన‌ట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు.


ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్ కోర్సులకు పరిశీలిస్తే..
బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ క‌మ్యూనికేష‌న్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌(ఈసీఐ), ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్స్‌(ఈటీఎం) కోర్సుల్లో 100 శాతం సీట్లు భ‌ర్తీ కాగా, ఎల‌క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌(ఈసీఈ)లో 87.10 శాతం సీట్లు నిండాయి. ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్ ఇంజినీరింగ్(ఈఈఈ)లో కేవ‌లం 58.38 శాతం సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి.


సివిల్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు పరిశీలిస్తే..
మెట‌లార్జిక‌ల్ ఇంజినీరింగ్(ఎంఈటీ), బీటెక్ మెకానిక‌ల్ విత్ ఎంటెక్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ సిస్ట‌మ్స్‌(ఎంఎంఎస్), బీటెక్ మెకానిక‌ల్ విత్ ఎంటెక్ థ‌ర్మ‌ల్ ఇంజినీరింగ్(ఎంటీఈ), ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్, మెకానిక‌ల్(మెక్‌ట్రోనిక్స్) ఇంజినీరింగ్‌(ఎంసీటీ), ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో 100 శాతం సీట్లు, సివిల్ ఇంజినీరింగ్‌లో 44.76 శాతం సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్(ఎంఈసీ)లో 38.50 శాతం సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి.


ఇక కెమిక‌ల్ ఇంజినీరింగ్‌ విషయానికొస్తే.. మొత్తం 98.65 శాతం, జియో ఇన్ఫ‌ర్మెటిక్స్‌లో 95.38 శాతం, అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌లో 93.94 శాతం సీట్లు నిండాయి. ఇండ‌స్ట్రీయ‌ల్ ప్రొడ‌క్షన్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలి క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఒక్క సీటు కూడా భ‌ర్తీ కాలేదు.


సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial